సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై సినీ వర్గాలతో పాటు ఏపీ మంత్రులు తీవ్రంగా స్పందించారు. సినీ పరిశ్రమలో అయితే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. రెండు రోజుల పాటు విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసి మరీ వ్యక్తిగంతగా కూడా దూషించాడు.

దీనికి పవన్ అభిమానులతో పాటు జనసేన కార్యకర్తలు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. దారుణమైన బూతులతో పవన్ ని కించపరిచిన పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన నాయకురాలు నిహారిక కూడా మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోసాని కృష్ణమురళి మానసిక రోగిగా మారాడని.. అతడిన వెంటనే ఆసుపత్రిలో చూపించండి.. లేదంటే సమాజానికి ప్రమాదం అంటూ అతని పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అతడికి తగినట్లుగా మెంటల్ కృష్ణ సినిమా తీశాడని.. ప్రస్తుతం అతడికి ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఆడవాళ్లపై ఎలాంటి బ్యాడ్ కామెంట్లు చేయలేదని.. అయితే జగన్ పై వ్యాఖ్యలు చేశారనే పోసాని రియాక్ట్ అవుతున్నారని పవన్ పై అనవసరమైన ఆరోపణలు చెయ్యవద్దని హెచ్చరించింది. పోసానిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. ఈ సందర్భంగా జనసేన నాయకులు నిహారిక డిమాండ్ చేసింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నిహారిక కోరింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






























