యుగాంతం గురించి ఇప్పటికే మనం ఎన్నో వార్తలు విని ఉంటాం. అయితే ఆ వార్తలు నిజం అయ్యే అవకాశం లేదని కొందరు కావాలనే యుగాంతం గురించి వార్తలు పుట్టిస్తున్నారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా వచ్చే ఏడాది భూమి అంతం కానుందంటూ ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. నోస్ట్రాడమస్ ప్రిడిక్షన్ వచ్చే ఏడాది భూకంపం రానుందని.. ఆ భూకంపం వల్ల భూమి అంతం కానుందని వెల్లడించింది.

భూగ్రహం అంతం కావడానికి ముందు కరువు వల్ల ఈ భూ ప్రపంచం అంతా విలవిలలాడుతుందని ఆ ప్రిడిక్షన్ లో పేర్కొన్నారు. గతంలో నోస్ట్రాడమస్ చెప్పినవి నిజం కావడంతో భూగ్రహం నిజంగానే అంతమవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. 465 సంవత్సరాల క్రితం నోస్ట్రాడమస్ ఏం చెప్పారో ఆ మాటలన్నీ నిజం అయ్యాయి. దీంతో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మాటలు నిజమవుతాయని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లెస్ ప్రాఫెసీస్ అనే పుస్తకంగా నోస్ట్రాడమస్ కొన్ని వందల సంవత్సరాల క్రితం భవిష్యత్తులో ప్రపంచంలో చోటు చేసుకునే పరిణామాల గురించి పేర్కొన్నారు. ఈ పుస్తకంలో భవిష్యత్తు గురించి మొత్తం 6338 విషయాలను ప్రస్తావించారు. ఆయన ప్రస్తావించిన విషయాల్లో దాదాపుగా అన్ని విషయాలు నిజం కావడం గమనార్హం. నోస్ట్రాడమస్ వైరస్ లు, కరువు, భూకంపాలు. సూర్యుడి విశ్వరూపం, ప్రకృతి వైపరిత్యాల వల్ల భూమి అంతం కానుందని ఉంది.
ప్రపంచం గతంలో ఎప్పుడు చూడని కరువును చూడనుందని . నోస్ట్రాడమస్ పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన పుస్తకంలో హెచ్చరించిన విధంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తూ మానవాళిని ఇబ్బందుల్లోకి నెడుతుండటం గమనార్హం.































