Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన అనకాపల్లి నియోజక వర్గం పెందుర్తిలో పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం గంజాయి హబ్ గా మారిందని తెలిపారు.
గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో ఏకంగా 23 లక్షల మంది గంజాయికి అలవాటు పడ్డారని పవన్ తెలిపారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లిన ప్రజలందరూ ఒకటే ఆవేదన చెందుతున్నారు.
ఎక్కడికి వెళ్లినా వైకాపా నాయకులు మా ఆస్తులను దోచేశారని చెబుతున్నారు. ఇలాంటి వైకాపా గుండాలకు ఎవరు భయపడుద్దని ప్రజలందరూ ఎదురు తిరగండి అంటూ ఈయన సలహాలు ఇచ్చారు. అన్యాయాన్ని ఎదిరించండి. ప్రజల కోసం రోడ్లపైకి వచ్చాను ఎన్నో అవమానాలు తిట్లు దెబ్బలు తిన్నాను. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదాం కూటమి ప్రభుత్వాన్ని స్థాపిద్దాం.
జగన్ ను గద్దె దించుదాం…
ప్రజల బంగారు భవిష్యత్తుకు భాటలు వేద్దాం అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం త్రిమూర్తుల్లా ముందుకు వెళ్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఎన్నికలు మరో 10 రోజులలో జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలను చేశారు.





























