Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా అధికారులతో సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖలపై అన్ని విషయాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ఎక్కడైతే అవకతవకలు జరిగి ఉంటాయో వాటిని ప్రశ్నిస్తూ ఎంతో చురుగ్గా పరిపాలన కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడుతూ… ప్రభుత్వం నడిపించేవారు బాధ్యత గల నాయకులైతే ప్రజలకు కష్టాలు వుండవనీ, ఐతే గత ప్రభుత్వంలో ఇది జరగలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతం రాకపోతే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని పవన్ తెలిపారు.
తాను ఓ ప్రభుత్వ ఉద్యోగి బిడ్డను ఒకటో తేదీ జీతం రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు.. నేను మీ కష్టాలను అర్థం చేసుకోగలనని పవన్ తెలిపారు. ఇప్పటికే గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది అయితే ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది ఏంటి అనే విషయాల గురించి అన్ని ఆరా తీస్తున్నామని త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని తెలిపారు.
ఒకటో తేదీనే జీతం..
ఇక చంద్రబాబు నాయుడు గారు, తను కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల వారితో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పడమే కాకుండా ఒకటో తేదీకే జీతం పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.





























