Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయనకు ఓటు మాత్రం మంగళగిరిలో ఉండడంతో మంగళగిరికి వెళ్లి గాజు గ్లాసుకి కాకుండా సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలా మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోల్స్ కి గురి అవుతున్నాయి. ఓటు వేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ప్రింట్ అవుట్ ఇవ్వరా అంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఇలా అడగడంతో అధికారులు ప్రింట్ అవుట్ రాదు అంటూ సమాధానం చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భారీ స్థాయిలో పవన్ కళ్యాణ్ పై ట్రోల్స్ జరుగుతున్నాయి. కనీసం ఎప్పుడైనా ఓటు వేసిన మొహమా అది అంటూ కొందరు కామెంట్లు చేయగా ప్రింట్ అవుట్ రాదనే విషయం తెలియకుండా ఒక పార్టీకి అధ్యక్షుడు ఎలా అయ్యావు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్యాకేజీ కోసమా..
ఇక ఈ వీడియో పై సజ్జల భార్గవ్ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ ప్రింట్ అవుట్ అడగడంతో ప్రింట్ అవుట్ చూపించి చంద్రబాబు నాయుడుని మరింత ప్యాకేజీ ఎక్కువగా అడుగుదామనుకుంటున్నారా అంటూ కామెంట్స్ చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ భారీ స్థాయిలో ట్రోల్స్ కి గురవుతున్నాయి.





























