Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది ఎప్పుడు లేని విధంగా దేశంలోనే ఏపీ పోలింగ్ శాతం లో మొదటి స్థానంలో నిలిచింది. ఇలా పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇకపోతే కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ కూటమి నేతలు కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పదవి ఏంటి అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తనకు ఇరిగేషన్ శాఖ కావాలి అంటూ డిమాండ్ చేశారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా పవన్ కళ్యాణ్ ఇరిగేషన్ శాఖ ఎందుకు కావాలనుకుంటున్నారు ఏంటి అనే విషయాలు గురించి సరైన సమాచారం లేకపోయినా ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేగా గెలవాలి…
ఇలా కాలువలు సాగునీటి అంశాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటంతో బహుశా ఆయనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పై ఆసక్తి ఉందేమో అందుకే ఇదే తీసుకుంటారంటూ పలువురు భావిస్తున్నారు అయితే ఈ విషయం గురించి ఎలాంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు అయితే మరికొందరు పవన్ కళ్యాణ్ ఇలాంటి కోరికలు కోరడానికంటే ముందు పిఠాపురంలో తాను గెలవాలని కోరుకోవడం మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.





























