Pawan Kalyan: పార్టీ పెట్టి పదేళ్లయిన ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు అంటూ పవన్ కళ్యాణ్ ని గతంలో ఎంతో మంది ఎన్నోసార్లు అవమానించారు అయితే ఆ అవమానాలను తన విజయ సోపానాలుగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో వైఎస్ఆర్సిపీ పార్టీని భారీ దెబ్బ కొట్టారు. ఇలా జగన్ పార్టీని భూస్థాపితం చేస్తానని చెప్పిన విధంగానే పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చేశారు.

ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారిన పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో భాగం కావడంతో ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా ఈయన పాల్గొన్నారు అయితే పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఏ ఏ ప్రాంతాలలో అయితే పర్యటించారో ఆ ప్రాంతాలలో మహాయుతి కూటమి నేతలకు భారీ మెజారిటీ రావడం విశేషం.
పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో భాజపా కూటమి అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకువెళుతోంది. ప్రధానమంత్రి మోదీ అన్నట్లు… పవన్ కల్యాణ్ తుఫాన్ ప్రభంజనం మహారాష్ట్రలో కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ మహారాష్ట్ర ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పేరు మరోసారి దేశ రాజకీయాలలో సంచలనగా మారుమోగుతుంది.

Pawan Kalyan: గేమ్ ఛేంజర్..
ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ పాల్గొనడంతో అక్కడ కూటమికి భారీ మెజారిటీ లభించింది.2019 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు 105 విజయం సాధించగా ఇప్పుడు 2024లో ఆ సంఖ్య 122కి చేరుకుంటోంది. ఇది ఖచ్చితంగా పవన్ కల్యాణ్ ప్రభావం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా పవన్ పర్యటించిన ప్రాంతాలలో కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలియజేసాయి. ఇక ఫలితాలు కూడా అదే దిశగా దూసుకుపోతున్న తరుణంలో పవన్ పేరు మరోసారి దేశ రాజకీయాలలో మారు మోగడమే కాకుండా పవన్ ఒక గేమ్ ఛేంజర్ అంటూ అభిమానులు పవన్ రాజకీయ ప్రస్థానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.




























