Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత 11 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్ష వేశారు. గత నెల 25వ తేదీ ఈ దీక్ష వేశారు. అయితే ఈ దీక్షలో భాగంగా ఇటీవల సూర్య భగవానుడికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోనే జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సూర్యరాదనలో భాగంగా ఆదిత్య యంత్రం ఏర్పాటు చేసి దీని ఎదుటు ఆశీనులైన జనసేన అధినేత ప్రత్యక్ష భగవానుడిని వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజించారు.
ఇలా సూర్యభగవానుడిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈయన సమాజ శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తుంది. పూజా కార్యక్రమాలలో భాగంగా ఈ పూజ విశిష్టత గురించి పండితులు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాష్ట్ర సంక్షేమం కోసం..
ఇక పవన్ కళ్యాణ్ గతంలో ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తూ సూర్య భగవానుడిని ఆరాధించే వారట. అయితే ప్రస్తుతం దీక్షలో ఉన్నటువంటి ఈయన సూర్య నమస్కారానికి బదులుగా సూర్య నమస్కారాలకు సంబంధించి మంత్ర సహిత ఆదిత్య ఆరాధనను వారాహీ దీక్షలో భాగంగా అత్యంత ఘనంగా నిర్వర్తించారు.





























