తెలుగు సినిమాల్లో హాట్ హాట్ పాత్రలకు జీవం పోసి.. నిర్మాతల పై కాసుల వర్షం కురవడానికి తన వంతుగా ఒళ్ళు విరుచుకుని మరీ ఘాటు సన్నివేశాలలో హీట్ పెంచింది నటి జ్యోతి.. నిజానికి వదిన..అక్క.. తల్లి పాత్రల్లో నటించాలని ఎప్పటి నుండో తానూ కలలు కంటున్నానని.. కానీ ఆంటీ పాత్రలు మాత్రమే తనకు ఎక్కువుగా వచ్చాయని ఇప్పుడు చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తోంది జ్యోతి.

అయితే తాజాగా ఆమె చేసిన కామెంట్సే పవర్ స్టార్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది.సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని..
అలాంటిది మొదటిసారి పవన్, షూటింగ్ సమయంలో తన మీద కవిత్వం రాసేశారని, పవన్ కళ్యాణ్ తనని ట్రై చేశాడని అన్నట్టు జ్యోతి సెన్సేషనల్ కామెంట్ చేసింది. గుడుంబా శంకర్ సినిమాలో జ్యోతి, పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. బహుశా ఆ సీన్స్ షూటింగ్ సమయంలోనే పవన్ సరదాగా ఈ హాట్ ఆంటీ పై కొన్ని సరదా కామెంట్స్ చేసి ఉండొచ్చు. దానికి పవన్ తన గురించి కవిత్వం రాశాడని జ్యోతి ఇప్పుడు చెప్పుకుంటుంది.
ఏది ఏమైనా జ్యోతి కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక జ్యోతి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె తన భర్తకు దూరంగా ఉంటుంది. కొడుకును పెంచుకుంటూ సింగిల్ మహిళగా ఆమె దైర్యంగా లైఫ్ ను లీడ్ చేస్తోంది..ఇక తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవడమే కాదు.. కొందరు పవన్ ఫ్యాన్స్ ఈమె పై కోపంతో ఈమెను ట్రోల్స్ చేస్తున్నారు..మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఇదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని పవన్ పై ఈ నటి చేసిన కామెంట్స్ ని కొట్టి పారేస్తున్నారు..!!


































