Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు పవన్ కళ్యాణ్ .ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో టాలీవుడ్ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ విజయం పై ఇప్పటికే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
ఇలా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చారని తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఈయన తన నిర్మాణ సంస్థలో ఏకంగా వంద సినిమాలను నిర్మించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు.
టీజీ విశ్వప్రసాద్..
ఇక పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా కూడా ఈయన నిర్మాణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది తద్వారా పవన్ కళ్యాణ్ తో చాలా మంచి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఈయన సెలెబ్రేట్ చేశారు జూన్ 23వ తేదీ రాత్రి హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు దర్శక నిర్మాతలు కూడా హాజరై సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



























