స్పెయిన్ కి చెందిన ప్రముఖ చిత్రకారుడు పికాసో పెయింటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతని పెయింటింగ్స్ కు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా పికాసో పెయింటింగ్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. మామూలుగానే పికాసో గీసిన చిత్రాలు వంద కోట్లకు పైనే ఉంటాయి. తాజాగా అలాంటి చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పికాసో 1932 లో గీసిన మేరీ థెరిసె(కిటికీ వద్ద కూర్చుని ఉన్న యువతి) పెయింటింగ్కి భారీ ధర పలికింది. ఈ పెయింటింగ్ ని న్యూయార్క్కి చెందిన క్రిస్టైన్స్ సంస్థ గురువారం వేలం వేసింది. వేలం ప్రారంభమైన 19 నిమిషాల్లోనే ఈ పెయింటింగ్ ఏకంగా 103.4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. భారత కరెన్సీ ప్రకారం ఈ పెయింటింగ్ ధర అక్షరాల 758 కోట్లు.
1932 లో గీసిన ఈ పెయింటింగ్ వేలానికి పెట్టినప్పుడు సుమారు 55 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోతుందని భావించిన వేలం సంస్థ ఒకేసారి ఈ పెయింటింగ్ 103.4మిలియన్ డాలర్లకు అమ్ముడుపోవడం తమకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని తెలిపారు. ఈ పెయింటింగ్ తో కలిపి పికాసో గీసిన చిత్రాలలో 100 మిలియన్ డాలర్లు మార్క్ దాటిన చిత్రాల సంఖ్య ఐదుకు చేరింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ కరోనా విపత్కర పరిస్థితులలో కూడా ఈ ఆర్ట్ ఇంత ధర పలకడం ఎంతో ఆశ్చర్యంగా ఉందని వేలం వేసిన క్రిస్టైన్స్ పేర్కొంది. కరోనా సమయంలో కూడా కళాపోషణ ఏమాత్రం తగ్గలేదని క్రిస్టైన్స్ సంస్థ సంతోషం వ్యక్తం చేశారు.



























