Divvela Madhuri: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఏదైనా హాట్ టాపిక్ గా మారింది అంటే అది దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారమే అని చెప్పాలి. ఈయన కట్టుకున్న భార్య పిల్లలను పక్కనపెట్టి దివ్వెల మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే తన గురించి వస్తున్న ఈ వార్తలను భరించలేక మాధురి ఆత్మహత్యకు పాల్పడుతూ కారు ఆక్సిడెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే తనకు ప్రమాదం జరగలేదని తానే ఆత్మహత్య చేసుకోవడం కోసం ఇలా చేశాననే షాకింగ్ విషయాలను మాధురి బయటపెట్టారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలను చూసి ఎంతో మనస్థాపానికి గురయ్యానని తెలిపారు.
ఈ ఆరోపణలను భరించలేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుని కారులో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న లారీకి ఢీ కొట్టాలని వెళ్లాను కానీ పొరపాటున కారుకు డి కొట్టానని ఈమె తెలియజేశారు. ఈ విధంగా తానే ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా చేశానని చెప్పడంతో ఈమెపై విజయవాడ పోలీసుల కేసు నమోదు చేశారు.
సస్పెండ్ చేయాలి..
ఇక మాధురికి పెళ్లి జరిగి తన భర్త నుంచి విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ క్రమంలోనే ఈమె దువ్వాడ శ్రీనివాస్ కి సన్నిహితంగా ఉండడంతో ఆయన భార్య పిల్లలు వీరి వ్యవహారాన్ని బయటపెట్టారు. ఇక ఈ విషయం గురించి పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. పలువురు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటు డిమాండ్ చేస్తున్నారు.





























