Poojitha : ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా రెండో హీరోయిన్ గా నటించిన పూజిత ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా రానించలేకపోయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన పూజిత ఆ తరువాత సినిమాలకు దూరమై ప్రేక్షకులకు కనిపించలేదు. చాలా రోజుల తరువాత తన భర్త మీద కేసు పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన పూజిత, తన భర్త మోసం చేసాడని మళ్ళీ ఒక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. తాను ఎదుర్కొన్న సమస్యలు ఏ అమ్మాయికి రాకూడదంటూ ఎమోషనల్ అయ్యారు.

నరేష్ నెత్తి మీద శనిని పెట్టుకున్నాడు…
తన భర్త మీద కేస్ పెట్టాలని అనుకున్నపుడు ఎవరూ సహకరించలేదని, ఐఏఎస్ అధికారి ఇందులో ఉండటం వల్ల నా కేస్ ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు పూజిత. ఇక మా అసోసియేషన్ కి సహాయం చేయమని అడగడానికి వెళితే మొహం చాటేసారని అప్పుడు మా అసోసియేషన్ లో రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా ఉన్నారు, అయినా నా సమస్య ఏంటని వినడానికి కూడా సిద్ధంగా లేరని తెలిపారు. నా బాబు ని పెంచుకుంటూ సింగల్ గా ఉంటూ చాలా కష్టాలు పడ్డాను కానీ ఎవరినీ సహాయం అడగలేదు.

కానీ నాకు తెలియకుండా నరేష్ సహాయం చేసాడు అంటూ చెప్పారు పూజిత. మా అసోసియేషన్ లో ఉన్నపుడు కూడా నరేష్ చాలా మంచి పనులు చేసారని కళ్యాణ లక్ష్మి, వికలాంగులకు సహాయం అందించడం ఇంకా చాలా మంచి పనులు చేసాడని చెప్పారు. కానీ అయనంటే పడని వాళ్ళు నెగెటివిటీ ప్రచారం చేసారని తనకు కావాల్సిన మనుషులకు సహాయం అందించారని విమర్శించారు. అయితే ఇదంతా నరేష్ చేసుకున్నదే, చేసిన పని చెప్పుకోక పోతే ఇలానే ఉంటుంది. శనిని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నపుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు అంటూ మాట్లాడారు పూజిత. తనకు సహాయం చేసిన సంగతి చాలా రోజులకు తెలిసి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లినా చెప్పనివ్వలేదు, తను నాకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది పూజిత.


































