Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కరోనా బారిన పడ్డారు. ఇదివరకే ఈయన రెండుసార్లు కరోనా బారిన పడగా తాజాగా ఈయన మూడో సారి కరోనా బారిన పడ్డారు.ఈయనకు కరోనా అని తెలియడంతో కుటుంబ సభ్యులు తనని నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

ఓ సినిమా షూటింగ్లో భాగంగా పూణే వెళ్లినటువంటి పోసాని గురువారం హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ఆయనకు ఒంట్లో బాగా లేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోక పాజిటివ్ అని తెలియడంతో వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈయన మూడోసారి కరోనా బారిన పడటం గమనార్హం.

Posani Krishna Murali: ఆందోళనలో అభిమానులు
ప్రస్తుతం కరోనా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీల సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇలా పోసాని కరోనా బారిన పడ్డారని తెలియగానే పలువురు ఈయన క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.































