Posani Krishna Murali: నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ మరణించారు. ఈయన మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని తన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

ఇక కైకాల మరణ వార్త తెలుసుకున్నటువంటి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కూడా తన మృతికి సంతాపం ప్రకటిస్తూ పోస్టులు చేశారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కైకాల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచి ఉండే పోసాని కృష్ణమురళి సైతం కైకాల సత్యనారాయణ మరణం గురించి స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పోసాని సత్యనారాయణ మరణం గురించి ఎలా స్పందించారు అనే విషయానికి వస్తే…

Posani Krishna Murali: నిజాయితీగా బతికిన నటుడు కైకాల…
చెంచాగిరి చేయకుండా… డ్రామాలు ఆడకుండా నిజాయితీగా బతికిన నటుడు కైకాల సత్యనారాయణ. కాలం ఉన్నంతవరకు కాకపోయినా సినీ కళాకారులు బ్రతికున్నంత కాలం బ్రతికి ఉండే నటుడు కైకాల గారు..జోహార్ అంటూ ఆయన మృతి పట్ల స్పందిస్తూ ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
































