Posani: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైకాపా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీలలోకి వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొంతమంది మాత్రం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నామని ప్రకటిస్తున్నారు. తాజాగా సినీ నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారు.

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా పార్టీ కార్యకలాపాలలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈయనకి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను అప్పజెప్పారు. ఈ విధంగా ఈయన వైసీపీ పార్టీలో కొనసాగుతూ పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫాన్స్ ఏకంగా ఈయన ఇంటిపై కూడా దాడి చేశారు.
ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై కూడా కేసు నమోదు కావడంతో ఈయన స్పందించారు. తాను అనవసరంగా ఎవరిని తిట్టలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు తన కుటుంబం పై దాడి చేయడంతోనే నేను కూడా విమర్శలు చేశాను అంటూ ఈయన చెప్పారు.

Posani: సినిమాలలో కొనసాగుతా..
ఇక తాజాగా తాను ఈ రాజకీయాలలో కొనసాగలేనని అందుకే తాను ఏ పార్టీలకు మద్దతు తెలియజేయకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా రచయితగా కూడా కొనసాగాను. ఇకపై సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తానని లేకపోతే నేనే సినిమాలు చేస్తాను అంటూ కూడా ఈ సందర్భంగా పోసాని జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఈయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

































