Prabhas & Anushka : సెప్టెంబర్ 11 నాడు తెల్లవారుజామున కృష్ణం రాజు గారు తుదిశ్వాస విడిచి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణం అందరినీ షాక్ కి గురిచేస్తే ఆయన మరణం తో పాటు ఆయన పిల్లలు అయిన నలుగురు ఆడపిల్లలకు అలాగే తమ్ముడి కొడుకు హీరో ప్రభాస్ కు ఇంకా పెళ్లి చేయాల్సి ఉంది. నిజానికి కృష్ణం రాజు గారు బ్రతికి ఉన్నపుడు చాలా సార్లు ప్రభాస్ పెళ్లి గురించి చెప్పారు త్వరలో చేస్తాము అంటూ చెప్పారు. పెళ్లి చేసి తన పిల్లలతో ఆడుకోవాలని ఉంది అంటూ చెప్పేవారు కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. ఇక అయన పార్థివ దేహాన్ని సందర్శించుకోడానికి ఎంతో మంది సినిమా తారలు వచ్చినా అందులో అనుష్క రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ అనుష్క ప్రభాస్ పెళ్లి గురించిన టాపిక్ మొదలయింది.

ఇద్దరి పెళ్లి ఎప్పుడంటే…
కృష్ణం రాజు గారికి ఎంతో సన్నిహితుడైన నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు. ఇంకా చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేయాల్సిన బాధ్యత ప్రభాస్ మీద ఉంది, ఇక తన పెళ్లి కూడా త్వరలో జరిగితే కృష్ణం రాజుగారి ఆత్మ చాలా సంతోషిస్తుంది అంటూ చెప్పారు. అనుష్క తో ప్రభాస్ పెళ్లి జరిగితే బాగుంటుంది అంటూ వాక్యాణించారు. ఏది ఏమైనా కృష్ణం రాజు గారు చనిపోయిన ఏడాది లోనే పెళ్ళి అయిపోతే బాగుంటుంది అంటూ అభిప్రాయ పడ్డారు.

అయితే ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉండటం అదికూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వల్ల చాలా బిజీగా హైదరాబాద్ లో తక్కువగా ముంబై లో ఎక్కువగా ఉన్నాడని పెళ్లి చేసుకోడానికి సమయం కష్టమే అంటూ అభిప్రాయపడ్డారు. ఇక అనుష్క, ప్రభాస్ లు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ చెప్పి వాళ్ళ పెళ్లి మాట ఎత్తి ఇద్దరి ఫ్యాన్స్ ను ఊరించారు. మరి నిజంగా చిట్టిబాబు గారు చెప్పినట్లు ప్రభాస్, అనుష్క ల పెళ్లి జరిగితే బాగుంటుంది.
































