Radhe Shyam Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మచ్ అవైటెండ్ మూవీ రాధేశ్యామ్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. బాహుబలి, సాహోల తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ మరోసారి రాధేశ్యామ్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు.

జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సాహో తరువాత చేస్తున్న సినిమాపై భారీగా అంచానాలు పెరిగిపోయాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాపై అన్ని సినీ ఇండస్ట్రీల్లో భారీగా క్రేజ్ ఏర్పడింది. దీనికి అనుగుణంగానే మూవీ టీం ప్రమోషన్లను వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ మూవీపై చర్చ జరుగుతోంది.

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈసినిమాలో ప్రభాస్ లవర్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరిగింది. నవీన్ పోలిశెట్టి హోస్ట్ వ్యవహరించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది.
ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా..
దేశ నలుమూల నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్స్ వచ్చారు. దాదాపు 40 వేల మంది ఈ ప్రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రాధేశ్యామ్ ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది. మా హీరో మళ్లీ హిట్ కొట్టాడురా..అంటూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు.





























