Connect with us

Featured

ఎంత మోసం.. ఇది ప్రియమణి కాదు పైడమ్మ.. ఆమె చెప్పిన నిజం.. దీప కాపురం చక్కబడినట్లే!

Published

on

బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1093 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో దీపం మోనిత ఇంటికి వెళ్లి దుర్గ గుర్తున్నాడా.. అంజి గుర్తున్నాడా అంటూ తనని భయపెడుతుంది. ఇక నేడు ఎపిసోడ్ లో భాగంగా దీప ఇంట్లో తన పిల్లలతో పాటు శ్రావ్య అందరూ తన మామయ్య కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో ఆదిత్య తన తండ్రిని తీసుకుని రావడంతో పిల్లలందరూ తమ తాతయ్య హత్తుకొని ఎంతో సంతోషంగా ఉంటారు.తాతయ్య తెచ్చిన గిఫ్ట్ కార్లో ఉన్నాయంటూ పిల్లలు సంతోషంతో బయటకు వెళ్లిపోగా, దీపా శ్రావ్య వంట చేయడానికి వెళ్తారు. ఆనందరావు, కార్తీక్ సోఫాలో కూర్చుంటారు.

ఇప్పుడు చెప్పురా.. పిల్లల నవ్వులో తప్ప మీ నవ్వులో జీవం లేదు. నవ్వు అంటే శబ్దం కాదు అదొక అనుభూతి అది ఎందుకో లోపించినట్లు ఉంది అంటాడు.ఊరుకో డాడీ నువ్వు.. గళ్లున నవ్వే వయసా మాదీ..? అవును మమ్మీకి కాల్ చేశావా’అంటూ కార్తీక్ మాట మార్చడంతో ఆనందరావు మరో నాలుగు రోజుల్లో మమ్మీ కూడా వచ్చేస్తుంది అంటాడు. ఇక ఇంటరాగేషన్ లో భాగంగా సీసీ కెమెరాలు ఉన్న గదిలో ఉంచిన ప్రియమణిని మళ్లీ పిలిచి ప్రశ్నలతోనే వణికిస్తుంది రోషిణీ.

ఈ క్రమంలోనే నీ పేరేంటి? అని రోషిణీ అడగగా ప్రియమణమ్మా… అంటుంది ప్రియమణి. నేను అడిగింది నీ పేరు ఏంటని అంటూ మూడుసార్లు అడగగా భయంతో ప్రియమణి అసలు పేరు పైడమ్మ అనే విషయం బయట పెడుతుంది. గుడ్ ఒక్క నిజం చెప్పావు మొత్తానికి అని అంటూనే నీకు చాలా నిజాలు తెలుసు అనే విషయం నాకు తెలుసు. ఆ నిజాలు బయట పెడితే మీ మేడం నిన్ను చంపేస్తుందన్న విషయం నాకు తెలుసు అంటుంది రోషిణీ. మీకు దండం పెడతానమ్మ నాకు నిజంగానే ఏమీ తెలియదని ప్రియమణి వణుకుతూ చెబుతుంది.

Advertisement

అవును మీ అమ్మగారికి ఫోన్ చేద్దామని ఫోన్ బయటకి తీసావు… కానీ ఎందుకు చేయలేదని రోషిణీ అడగగా లేదమ్మా నేను అసలు ఫోన్ బయటికి తీయలేదని ప్రియమని చెప్పడంతో అవునా …ఇదేంటి మరీ అని సీసీ కెమెరా రికార్డ్‌ని చూపించడంతో.. ప్రియమణి భయపడుతుంది. ఫోన్ బయటకు తీసిన దానివి ఎందుకు చేయలేదని రోషిణీ అడగగా..మీరు ఇలాంటివి ఏవో సెటప్ చేసి ఉంటారని చేయలేదు అంటూ సీసీ కెమెరా రికార్డ్ ను చూపిస్తూ. కార్తీక్ మీ అమ్మ గారి దగ్గరికి వస్తుంటాడా..? అని రోషిణీ అడగగా.. వస్తుంటాడు… పోతుంటాడు అంటూ ప్రియమణి సమాధానం చెబుతుంది.

ఈ వస్తూ… పోతూ ఉండటం మధ్య వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? ఇద్దరూ మాట్లాడుతూనే ఉంటారమ్మ.. మరి మాట్లాడితే మీ అమ్మగారు తల్లి ఎలా అయింది? సరే “కార్తీక్‌ని మోనిత ప్రేమించిందా”..? “మోనితే కార్తీక్‌ని ప్రేమించిందా”..?అని అడగడంతో.. మా అమ్మగారు కార్తీక్ బాబును కాస్త ఎక్కువగా ప్రేమించింది. కార్తీక్ బాబు మా అమ్మను కాస్త తక్కువగా ప్రేమించాడు అని సమాధానం చెబుతుంది. కార్తీక్ తక్కువగా ప్రేమించినా.. తప్పు జరిగిపోయింది అంటావు. లేదంటే మోనిత తల్లి కావడానికి అని సందేహ పడుతున్న రోషిణీతో మా అమ్మ తల్లి కావడానికి కార్తీక్ అయ్యే కారణమంటూ చెబుతుంది.

నేను రాకముందు కార్తీక్ అయ్య మోనితమ్మాను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారట. ఓసారి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిందట.. కార్తీక్ అయ్య వాళ్ల అమ్మ ఆపేశారని ప్రియమణి చెప్పడంతో రోషిణీ ఆలోచనలో పడి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు పిలిచినప్పుడు రావాలి. ఇక్కడ జరిగినదేది మీ అమ్మగారికి చెప్పకు అని పంపిస్తుంది.అయితే మొనిత దగ్గరికి వెళ్ళిన ప్రియమణి జరిగినదంతా చెబుతుంది. దీపతో పాటు మోనిత దగ్గరికి వెళ్లిన భాగ్యం ఇంటికి వెళ్లి తన భర్తతో కూతురు జీవితం బాగు పడినట్లే అని చెప్పడంతో ఎంతో సంతోషిస్తారు.ఇక దీప ఇంట్లో అందరూ కలిసి ఎంతో సంతోషంగా భోజనం చేస్తుంటారు. కార్తీక్ మాత్రం ప్లేట్లులో గీతలు గీస్తూ ఆలోచిస్తుంటాడు.దాంతో ఆనందరావు.. ‘ఏమైంద్రా? గీతలు గీస్తున్నావ్’ అని అడగడంతో.. సౌర్య.. ‘అవును తాతయ్యా.. డాడీ ఇంట్లో కూడా గోడ పై గీతలు గీస్తున్నాడు అని చెప్పడంతో దీప ,కార్తీక్ బిత్తరపోతారు. తరువాత ఏం జరుగుతుందో అనేది మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.

Advertisement

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Anasuya: పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్.. పిలిస్తే జనసేన ప్రచారానికి వెళ్తా: అనసూయ

Published

on

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేస్తున్నటువంటి పొలిటికల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

sut

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ నాకు రాజకీయాలంటే అసలు ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ మా నాన్న రాజకీయాలలోకి వెళ్లేవారని నాకు ఇష్టం లేకపోవడంతోనే తనని మాన్పించానని ఈమె తెలిపారు. అయితే నేను కూడా ఈ సొసైటీలో ఉన్నాను కనుక సొసైటీ కి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుందని ఈమె తెలిపారు.

ఇక మీరు అడిగారు కాబట్టే నేను చెబుతున్నాను ఇలా మాట్లాడితే వివాదం జరుగుతుందని కూడా నాకు తెలుసు కానీ మనం ఓటు వేసేటప్పుడు పార్టీలను చూడకూడదని, నాయకులను మాత్రమే చూడాలని తెలిపారు. ఆ నాయకుడు సమర్థవంతుడా కాదా అనే విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఈమె తెలిపారు. ఇక నా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక గొప్ప లీడర్ అని తెలిపారు.

Advertisement

పార్టీని కాదు, నాయకుడిని చూడాలి..
పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే తప్పకుండా నేను జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాలకు కూడా వెళ్తాను అంటూ ఈ సందర్భంగా అనసూయ వెల్లడించారు అయితే ఇది నా అభిప్రాయం మాత్రమేనని, ఎవరి అభిప్రాయాలు ఏజెండాలు వారికి ఉంటాయని ఈ సందర్భంగా అనసూయ ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా చేసినటువంటి ఈ పొలిటికల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Ananya Nagalla: ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. అమ్మడి ఆశలు మామూలుగా లేవు?

Published

on

Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించినటువంటి ఈమెకు తదుపరి పలు సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఇలా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఈ సినిమా తర్వాత ఈమె వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇటీవల అనన్య నటించిన తంత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మార్చి 15వ తేదీ విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమె వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు. తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనన్య సమాధానం చెబుతూ నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అంటే హాయ్ నాన్న సినిమాలో హీరో నాని క్యారెక్టర్ ఉంది కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అబ్బాయి భర్తగా రావాలని కోరారు.

Advertisement

హీరో నాని..
గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి… రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలనీ కోరుకునే అబ్బాయి భర్తగా రావాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉన్న క్వాలిటీస్ గురించి ఈ వ్యాఖ్యలు చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి నెటిజన్ లు అమ్మడికి కోరికలు మామూలుగా లేవుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!