బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ నేడు 1093 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. గత ఎపిసోడ్ లో దీపం మోనిత ఇంటికి వెళ్లి దుర్గ గుర్తున్నాడా.. అంజి గుర్తున్నాడా అంటూ తనని భయపెడుతుంది. ఇక నేడు ఎపిసోడ్ లో భాగంగా దీప ఇంట్లో తన పిల్లలతో పాటు శ్రావ్య అందరూ తన మామయ్య కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో ఆదిత్య తన తండ్రిని తీసుకుని రావడంతో పిల్లలందరూ తమ తాతయ్య హత్తుకొని ఎంతో సంతోషంగా ఉంటారు.తాతయ్య తెచ్చిన గిఫ్ట్ కార్లో ఉన్నాయంటూ పిల్లలు సంతోషంతో బయటకు వెళ్లిపోగా, దీపా శ్రావ్య వంట చేయడానికి వెళ్తారు. ఆనందరావు, కార్తీక్ సోఫాలో కూర్చుంటారు.
ఇప్పుడు చెప్పురా.. పిల్లల నవ్వులో తప్ప మీ నవ్వులో జీవం లేదు. నవ్వు అంటే శబ్దం కాదు అదొక అనుభూతి అది ఎందుకో లోపించినట్లు ఉంది అంటాడు.ఊరుకో డాడీ నువ్వు.. గళ్లున నవ్వే వయసా మాదీ..? అవును మమ్మీకి కాల్ చేశావా’అంటూ కార్తీక్ మాట మార్చడంతో ఆనందరావు మరో నాలుగు రోజుల్లో మమ్మీ కూడా వచ్చేస్తుంది అంటాడు. ఇక ఇంటరాగేషన్ లో భాగంగా సీసీ కెమెరాలు ఉన్న గదిలో ఉంచిన ప్రియమణిని మళ్లీ పిలిచి ప్రశ్నలతోనే వణికిస్తుంది రోషిణీ.
ఈ క్రమంలోనే నీ పేరేంటి? అని రోషిణీ అడగగా ప్రియమణమ్మా… అంటుంది ప్రియమణి. నేను అడిగింది నీ పేరు ఏంటని అంటూ మూడుసార్లు అడగగా భయంతో ప్రియమణి అసలు పేరు పైడమ్మ అనే విషయం బయట పెడుతుంది. గుడ్ ఒక్క నిజం చెప్పావు మొత్తానికి అని అంటూనే నీకు చాలా నిజాలు తెలుసు అనే విషయం నాకు తెలుసు. ఆ నిజాలు బయట పెడితే మీ మేడం నిన్ను చంపేస్తుందన్న విషయం నాకు తెలుసు అంటుంది రోషిణీ. మీకు దండం పెడతానమ్మ నాకు నిజంగానే ఏమీ తెలియదని ప్రియమణి వణుకుతూ చెబుతుంది.
Advertisement
అవును మీ అమ్మగారికి ఫోన్ చేద్దామని ఫోన్ బయటకి తీసావు… కానీ ఎందుకు చేయలేదని రోషిణీ అడగగా లేదమ్మా నేను అసలు ఫోన్ బయటికి తీయలేదని ప్రియమని చెప్పడంతో అవునా …ఇదేంటి మరీ అని సీసీ కెమెరా రికార్డ్ని చూపించడంతో.. ప్రియమణి భయపడుతుంది. ఫోన్ బయటకు తీసిన దానివి ఎందుకు చేయలేదని రోషిణీ అడగగా..మీరు ఇలాంటివి ఏవో సెటప్ చేసి ఉంటారని చేయలేదు అంటూ సీసీ కెమెరా రికార్డ్ ను చూపిస్తూ. కార్తీక్ మీ అమ్మ గారి దగ్గరికి వస్తుంటాడా..? అని రోషిణీ అడగగా.. వస్తుంటాడు… పోతుంటాడు అంటూ ప్రియమణి సమాధానం చెబుతుంది.
ఈ వస్తూ… పోతూ ఉండటం మధ్య వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? ఇద్దరూ మాట్లాడుతూనే ఉంటారమ్మ.. మరి మాట్లాడితే మీ అమ్మగారు తల్లి ఎలా అయింది? సరే “కార్తీక్ని మోనిత ప్రేమించిందా”..? “మోనితే కార్తీక్ని ప్రేమించిందా”..?అని అడగడంతో.. మా అమ్మగారు కార్తీక్ బాబును కాస్త ఎక్కువగా ప్రేమించింది. కార్తీక్ బాబు మా అమ్మను కాస్త తక్కువగా ప్రేమించాడు అని సమాధానం చెబుతుంది. కార్తీక్ తక్కువగా ప్రేమించినా.. తప్పు జరిగిపోయింది అంటావు. లేదంటే మోనిత తల్లి కావడానికి అని సందేహ పడుతున్న రోషిణీతో మా అమ్మ తల్లి కావడానికి కార్తీక్ అయ్యే కారణమంటూ చెబుతుంది.
నేను రాకముందు కార్తీక్ అయ్య మోనితమ్మాను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారట. ఓసారి పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిందట.. కార్తీక్ అయ్య వాళ్ల అమ్మ ఆపేశారని ప్రియమణి చెప్పడంతో రోషిణీ ఆలోచనలో పడి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు పిలిచినప్పుడు రావాలి. ఇక్కడ జరిగినదేది మీ అమ్మగారికి చెప్పకు అని పంపిస్తుంది.అయితే మొనిత దగ్గరికి వెళ్ళిన ప్రియమణి జరిగినదంతా చెబుతుంది. దీపతో పాటు మోనిత దగ్గరికి వెళ్లిన భాగ్యం ఇంటికి వెళ్లి తన భర్తతో కూతురు జీవితం బాగు పడినట్లే అని చెప్పడంతో ఎంతో సంతోషిస్తారు.ఇక దీప ఇంట్లో అందరూ కలిసి ఎంతో సంతోషంగా భోజనం చేస్తుంటారు. కార్తీక్ మాత్రం ప్లేట్లులో గీతలు గీస్తూ ఆలోచిస్తుంటాడు.దాంతో ఆనందరావు.. ‘ఏమైంద్రా? గీతలు గీస్తున్నావ్’ అని అడగడంతో.. సౌర్య.. ‘అవును తాతయ్యా.. డాడీ ఇంట్లో కూడా గోడ పై గీతలు గీస్తున్నాడు అని చెప్పడంతో దీప ,కార్తీక్ బిత్తరపోతారు. తరువాత ఏం జరుగుతుందో అనేది మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి.
YS Jagan: ఏపీ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది మరికొన్ని గంటలలో ఎన్నికలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఇప్పటికే ప్రతి ఒక్క గ్రామంలోనూ ఎన్నికల అధికారులు చేరుకొని ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వారందరూ కూడా సొంత ఊరికి చేరుకున్నారు.
మరికొన్ని గంటలలో ఎన్నికల ప్రక్రియ మొదలుకానున్నటువంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పులివెందుల బయలుదేరారు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైయస్ భారతి తో కలిసి నాలుగు గంటలకు పులివెందుల బయలుదేరారు ఇక రెండు రోజులపాటు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఉంటారని తెలుస్తోంది.
పులివెందులకు సీఎం.. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు ఒకవైపు పోలింగ్ ఉండటం మరోవైపు సీఎం వస్తున్నారని విషయం తెలియడంతో పులివెందులలో కట్టదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండటం కోసం ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను చేపట్టారు.
Nagababu: సినీ నటుడు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన ఈ ఎన్నికలలో కాకినాడ ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చాయి కానీ కూటమిలో భాగంగా ఆయనకు టికెట్ రాలేకపోయింది కానీ తన తమ్ముడికి గెలుపు కోసం తన పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు.
ఇకపోతే నాగబాబు సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే ఆయన ఎవరినైతే టార్గెట్ చేశారో వారికి సూటిగా ఆ వ్యాఖ్యలు గుచ్చుకునేలా ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత తన తమ్ముడిపై ఉన్నటువంటి చెమట బొట్టులను తుడుస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నిన్ను నమ్మని వాళ్లకోసం ఎందుకు నిలబడతావు అని నేను అడిగితే తను మాత్రం చెట్టును చూపిస్తారు అది తనని నాటిన వారికి మాత్రమే నీడను ఇవ్వదని చెబుతారు. నీపై నిందలు వేసే వారికోసం ఎందుకు నిలబడతావు అని అడిగితే వర్షాన్ని చూపిస్తారు. తనని మొక్కనీ రైతు కంటతడపకుండా పంటనే తడుపుతుందని అప్పటినుంచి అడగటమే మానేశానని నాగబాబు తెలిపారు.
Advertisement
మార్గదర్శకు మెట్టు.. ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను..సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది. సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో నీ గెలుపు సిద్దమైంది.. విజయీభవ..!అని నాగబాబు చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పవన్ ఫాన్స్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారని చెప్పాలి ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి వేణుస్వామి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి. గత కొద్ది రోజులుగా ఈయన పవన్ కళ్యాణ్ జాతకాలు గురించి చెబుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కూడా పవన్ కళ్యాణ్ కు సీఎం అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవని తెలిపారు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ చాలా మొండోడు ఎవరు చెప్పినా కూడా వినరు ఆయన కేవలం త్రివిక్రమ్ లాంటి వారు చెబితేనే వింటారు చివరికి తన అన్నయ్య చిరంజీవి చెప్పిన వినే వ్యక్తిత్వం తనది కాదని వేణు స్వామి తెలిపారు. ఇక నేను కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని తాను కూడా సీఎం కావాలని నేరు కోరుకుంటాను కానీ ఆయన జాతకం చూస్తే అది జరగదని వేణు స్వామి తెలిపారు.
పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం దాదాపు ఆయన చేసిన పది సినిమాలకు నేనే ముహూర్తాలు పెట్టానని వేణు స్వామి తెలిపారు. ఇలా ఈయనతో కలిసి గంటలు గంటలు మాట్లాడాను అయితే ఆయనంటే ఉండే ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి రావాలనే కాంక్ష వేరని వేణు స్వామి తెలిపారు.
Advertisement
సినిమాలతోనే మంచి పేరు.. ఇక రాజకీయ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు రాజకీయాలలో అవగాహన ఏమాత్రం లేదు. కుటిల రాజకీయాలు ఆయనకు తెలియవు. ఆయన నిర్ణయాలు చాలా బోల్డ్ గా ఉంటాయి. ఆయనకు రాజకీయాలు కలిసి రావు ఆయన సినిమాలకే అంకితం అవుతారు. మన అంచనాలు 100 శాతం ఉంటే.. రిజల్ట్ 20 శాతమే ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెడితేనే సక్సెస్ అవుతారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి పవన్ కళ్యాణ్ గురించి ఆయన జాతకం గురించి చెబుతూ కామెంట్లు చేయడంతో అభిమానులు కాస్త కలవర పడుతున్నారు.