Producer Chittibabu : త్రిబుల్ ఆర్ సినిమా సంచలనం రేపింది. ఒరిజినల్ నేటివ్ సాంగ్ కోటాలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కొట్టింది. మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇండియన్స్ అందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. వేదిక మీద పాట రచయిత చంద్ర బోస్ అలాగే కంపోజర్ కీరవాణి ఇద్దరూ ఆస్కార్ అందుకున్నారు. ఇక ఈ విషయం మీద ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఆయన స్పందన తెలియజేసారు.

ఆస్కార్ బాధ్యత పెంచింది…
చిట్టిబాబు గారు మాట్లాడుతూ ఆస్కార్ వేదిక మీద నాటు నాటు పాటకు అవార్డు వచ్చిందని ప్రకటించిన తరువాత ఆనందానికి అవధులు లేవు అంటూ తెలిపారు. వెంటనే కీరవాణికి అలానే చంద్రబోస్ గారికి అభినందనలు తెలుపుతూ మెసేజ్ చేసానని తెలిపారు. అయితే ఈ ప్రతిష్టాత్మక అవార్డు రావడానికి ముఖ్య కారకుడు రాజమౌళి అంటూ తెలిపారు. రాజమౌళి కష్టమే సినిమాను అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టింది అంటూ తెలిపారు.

సినిమాను అంతర్జాతీయంగా ప్రచారం చేసి తెలుగు సినిమాకు ప్రపంచం మార్కెట్ కు ద్వారాలు తెరిచాడు రాజమౌళి అంటూ తెలిపారు. ఆస్కార్ వేడుకల్లో ఒక కొరియన్ సినిమా 12 కేటగిరిల్లో నామినేట్ అయి 7 అవార్డులు తెచ్చుకుంది. అది చూసినపుడు నెక్స్ట్ ఇయర్ రాజమౌళి కూడా ఇలానే అవార్డులు అందుకుంటాడు అనిపించింది. అయితే ఈ అవార్డు బాధ్యతను పెంచింది, ఆ అవార్డు తలపొగురు పెంచకూడదు అంటూ మాట్లాడారు.

































