Producer Chittibabu : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి డైరీలో అసలు ఏమి రాశారు, ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అసలు కృష్ణ గారి ఆస్తులు ఆయన పంచారా, ఎవరికి ఇచ్చారు అనే విషయాల మీద క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు.

కృష్ణ గారి కుటుంబ విషయాలు సోషల్ మీడియకు ఎందుకు…
కృష్ణ గారి ఆస్తులు మహేష్, నరేష్ లలో ఎవరికి అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న రచ్చ గురించి మాట్లాడుతూ చిట్టిబాబు గారు ఫైర్ అయ్యారు. అసలు నరేష్ కి కృష్ణ గారి ఆస్తుల అవసరమే లేదు, ఆయనకు కృష్ణ గారి ఆస్తులతో సంబంధం లేదు. ఎందుకు ఇలాంటి వెధవ చర్చలను చేస్తున్నారు, పనిలేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. ఇక నరేష్ – మహేష్ మధ్య అస్థికలను కృష్ణ నదిలో కలిపే విషయంలో గొడవ జరిగిందని అందుకే నరేష్ హాజరు కాలేదు అన్న వాదన గురించి మాట్లాడారు.

కృష్ణ గారు నరేష్ కు తండ్రి కాదు, ఆయన అస్థికలను కలిపే కార్యక్రమానికి రానవసరం లేదు. దీనిపై ఎందుకంత చర్చ. విజయనిర్మల గారు మరణించినవుడు ఆమె అస్థికల నిమ్మజ్జనం సమయంలో నరేష్ వెళ్లి తంతు చేసాడు కానీ మహేష్ అప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఇలాంటి విషయాల మీద ఎందుకు చర్చలు అంటూ ప్రశ్నించారు. కృష్ణ గారు బ్రతికున్నట్లయితే ఆస్తులను అందరికీ సమానంగా పంచేసారు. వాళ్ళింట్లో అసలు అలాంటి గొడవలు వచ్చే ఆస్కారం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.


































