ఓటీటీలో సినిమా రిలీజ్ లను ఆపాలంటూ పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి విజ్ఞప్తి చేశాడు. ఆయన ఇండస్ట్రీ సమస్యలపై విలేకరులతో మాట్లాడుతూ.. టెక్నాలజీ డెవలప్మెంట్ ను ఎవరైనా ఒప్పుకోవాల్సిందే కానీ అమర్త్య సేన్ చెప్పినట్లు సాంకేతిక విప్లవం అనేది అట్టడుగు వర్గాలకు చెందని నాడు వేస్ట్ కదా అని అన్నాడు.

ఓటీటీ కూడా అంతే కాదా.. ప్రతీ ఒక్కరికీ ఓటీటీ అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు అట్టడుగున ఉండే వారికి.. పేదలకు, మారుమూల పల్లెల్లో ఉండే వారు ఎలా చూస్తారు అని ప్రశ్నించారు. మొన్న రిలీజ్ అయిన నారప్ప సినిమా కూడా కేలవం 25 శాతం మంది మాత్రమే చూశారని అని తెలిపారు.
ఇప్పుడు కరోనా కష్టాలున్నాయి.. జన సమూహాలు ఉండకూడదు.. కరోనా మహమ్మారి ప్రపంచాలన్ని పట్టి పీడిస్తుంది.. కానీ కాలం చాలా గొప్పది.. అన్నీ వాటితోనే సమసిపోతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పీపుల్స్ స్టార్ చెప్పుకొచ్చాడు. ఓటిటి పేదవాళ్ల దగ్గర లేదని.. అందుకే నారప్పను 100 శాతం చూడలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పేదవాళ్లు, బడుగు బలహీన వర్గాలకు నారప్ప చూసే అర్హత లేదా అంటూ ప్రశ్నించాడు.
థియేటర్స్లో చూడాల్సిన సినిమాను ఇంట్లో కూర్చుని చూడటం థియేటర్స్ వ్యవస్థకే మంచిది కాదంటూ హెచ్చరించారు. థియేటర్స్ ఉండాల్సిందే అని.. అవి లేకపోతే స్టార్స్ ఉండరని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓటీటీల కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయారిన.. థియేటర్స్ లు మూతపడే స్థితికి వచ్చిందని.. వీటంన్నింటిని దృష్టిలో ఉంచుకొని మళ్లీ థియేటర్లలోనే సినిమాలను విడుదల చేసే ఆలోచన చేయాలని సూచించాడు.



























