టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్యల మధ్య వివాదాం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజ్తరుణ్ తనతో కలిసి 11 ఏళ్లుగా సహజీవనం చేసి ఇప్పుడు మోసం చేశాడని ఇటీవల లావణ్య నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా లావణ్య తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని రాజ్తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేశారు.

బుధవారం సాయంత్రం లావణ్య తమ ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అయినా కూడా ఆమె తమను ఇబ్బందులకు గురిచేస్తోందని పోలీస్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. కాకతీయ హిల్స్ నివాసం ఉంటున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మిల ఇంటికి బుధవారం రాత్రి లావణ్య అనే యువతి వెళ్లి గట్టిగా డోర్ కొట్టి అరిచి గోల చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.































