Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆస్కార్ వేడుకల నిమిత్తం అమెరికా వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ వేడుకలు ముగిసిన తర్వాత చిత్ర బృందం మొత్తం హైదరాబాద్ చేరుకోగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం ఢిల్లీ వెళ్లారు. రామ్ చరణ్ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియా టుడే కాన్ క్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ ప్రధాని నరేంద్ర మోడీ సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప వారితో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు రావడానికి గల కారణాలను అలాగే ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా ఈయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తన మనసులో ఉన్నటువంటి ఒక కోరికను కూడా బయట పెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది రాజకీయ సినీ క్రికెట్ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన బయోపిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే చరణ్ సైతం ఇలాంటి ఒక బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ తెలిపారు.

Ram Charan: కోహ్లీ నాకు ఆదర్శం…
ఇప్పటికే ఎంతోమంది ఇండియన్ క్రికెటర్ల బయోపిక్ చిత్రాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే తనకు ఎంతో ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచిన విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉంది అంటూ రామ్ చరణ్ ఈ సందర్భంగా తన మనసులో కోరికను బయటపెట్టారు. ఇలా ఈయన కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటించాలని ఉందని చెప్పడంతో కోహ్లీ అభిమానులు, చరణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
” I would Like to Play anything do with Sport. I’ve been a long due Like something like a Sports based film.#ViratKohli inspires me a lot, if there is a chance to act in biopic of @imVkohli it will be fantastic “
~ @AlwaysRamCharan 🔥🔥#RamCharan pic.twitter.com/MVhHu02qSy
— Thyview (@Thyview) March 18, 2023