Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన విశ్వక్ సేమ్ అతి తక్కువ కాలంలోనే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల విశ్వక్ సేన్ నటించిన “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా మంచి హిట్ అవటంతో హీరోగా విశ్వక్ మరొక మెట్టు పైకి ఎదిగాడు. ప్రస్తుతం ‘ఓరి దేవుడా’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. పీవిపీ సినిమా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాని సమర్పిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అలనాటి హీరో దగ్గుబాటి వెంకటేష్ కీలక పాత్రలో నటించగా.. ఆశాభట్, మిథిలా పాల్కర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రాజమండ్రిలో అక్టోబర్ 16వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ గురించి రాంచరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ…” రెండు తెలుగు రాష్ట్రాలలో విశ్వక్ సేల్ గురించి తెలియని వారు లేరు. ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన విశ్వక్ అతి తక్కువ కాలంలోనే గల్లీ గల్లీకి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

Ram Charan: మాట ఇస్తే తప్పడు…
విశ్వక్ ఏదైనా ఒక్కసారి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడని మంచి పేరు ఉంది. ఇలా విశ్వక్ వ్యక్తిత్వానికి నేను ఒక పెద్ద అభిమానిని. ఉప్పెన సినిమా లాగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ అన్న నీ కోసమైనా ఈ సినిమా చూస్తాను” అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశ్వక్ గురించి రాంచరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
































