టోక్యో ఒలింపిక్స్లో భారత రెజ్లర్లు దీపక్ పూనియా , రవి దహియా సెమీస్కు చేరారు. 14-4 తేడాతో రవికుమార్ దహియా విజయం సాధించి సెమీస్కి అర్హత సాధించారు. బల్గేరియాకు చెందిన జార్జి వంజెలోవ్పై 57 కేజీల మెన్స్ ఈ ఫ్రీస్టయిల్ క్వార్టర్స్లో మ్యాచ్లో రవికుమార్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక సెమీస్లో కజికిస్తాన్కు చెందిన నూర్ ఇస్లామ్ సనియోతో రవికుమార్ తలపడుతాడు. ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ చేరుకుంటాడు.

ఇక మరో రెజ్లర్ దీపక్ పూనియా 86 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించాడు. చైనాకు చెందిన రెజ్లర్ సుషెన్ లిన్ను 6-3 తేడాతో దీపక్ ఓడించాడు. త్వరలో జరిగే సెమీస్లో డేవిస్ మోరిస్తో దీపక్ తలపడనున్నాడు.


































