Pawan Kalyan: సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటన చేసిన సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే ఆయన పిఠాపురం ప్రజలకు ఎన్నో దిశ నిర్దేశాలు చేశారు. ఇకపోతే ఈ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను పిఠాపురంలో ఇల్లు కట్టుకోవడానికి మూడు ఎకరాల స్థలం కొనుగోలు చేశానని త్వరలోనే ఇక్కడే సొంత ఇల్లు కట్టుకొని ఉంటానని తెలిపారు. ఇకపోతే ఇండ్లు మాత్రమే కాకుండా 16 ఎకరాలు పొలం కూడా కొనుగోలు చేయబోతున్నానని ఇప్పటికే ఆ పొలానికి సంబంధించి రైతులతో చర్చలు జరుపుతున్నట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఇలా ఈయన పొలం కొనుగోలు చేయబోతున్నానని తెలియడంతో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు పిఠాపురం మోహరించి పవన్ కళ్యాణ్ ఎక్కడ భూములు కొంటున్నారనే విషయంపై ఆరాతీస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనడానికి అక్కడికి రావడంతో పిఠాపురంలోని భూముల రేట్లు కూడా భారీగా పెరిగిపోతున్నాయి.
భూములకు రెక్కలొచ్చే…
ఒకప్పుడు హైవే పక్కనే ఎకరా 1.25 కోట్ల రూపాయలు విలువ చేస్తే భూములు ప్రస్తుతం మూడు కోట్ల వరకు ధర పలుకుతున్నడం విశేషం. ఇలా పవన్ కళ్యాణ్ ఒక మాటతో పిఠాపురంలోని భూములకు రెక్కలు వచ్చాయని భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పాలి.



























