Connect with us

Featured

తెలంగాణ యాసలో మాట్లాడి సందడి చేసిన హీరో హీరోయిన్స్ వీళ్ళే!

Published

on

దేశం అన్నాక ఒకే కుల, మతాలు ఉండవు. అదే విధంగా ఒకే విధమైన భాష మాట్లాడేవారు కూడా ఉండరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన భాషతో మాట్లాడుతుంటారు. మరి మన తెలుగు రాష్ట్రాలలో మాట్లాడేది తెలుగు భాష అయినప్పటికీ తెలంగాణలో ఒక విధంగా రాయలసీమలో ఒక విధంగా మాట్లాడుతుంటారు.ఈ క్రమంలోనే తెలంగాణలో మాట్లాడేది తెలుగు భాషే అయినప్పటికీ ఒక విధమైన యాస ఉంటుంది. తెలంగాణ వాసులు మాట్లాడే మాటతీరు కొంత భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాసలో ఎన్నో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను సందడి చేశాయి. మరి తెలంగాణ యాసతో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమాలు ఏమిటి? ఆ హీరో హీరోయిన్లు ఎవరు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

  • పెళ్లి చూపులు -విజయ్ దేవరకొండ: పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ హైదరాబాద్ వాసి అయినప్పటికీ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడడం పెద్ద కష్టమేమీ కాలేదు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ తెలంగాణ యాస ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.
  • ఫిదా -సాయి పల్లవి: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా పరిచయమైన సినిమా ఫిదా. ఈ సినిమాలో సాయి పల్లవి అచ్చు తెలంగాణ అమ్మాయిల తెలంగాణ భాషను ఎంతో అద్భుతంగా మాట్లాడి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
  • ఫలక్ నుమా దాస్ -విశ్వక్ సేన్: విశ్వక్ సేన్ హీరోగా వచ్చినటువంటి ఫలక్ నుమా దాస్ చిత్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, బోనాల ఉత్సవాలను ఎంతో అద్భుతంగా చూపించారు.
  • NET -రాహుల్ రామకృష్ణ: కమెడియన్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించినటువంటి చిత్రం
    NET. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ మరియు ప్రణీత పట్నాయక్ మొత్తం తెలంగాణ యాసతో మాట్లాడి ప్రేక్షకులను సందడి చేశారు.
  • ఇస్మార్ట్ శంకర్ -రామ్ పోతినేని: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాట్లాడినటువంటి తెలంగాణ యాసతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
  • మల్లేశం -ప్రియదర్శి: మల్లేశం సినిమాలో కమెడియన్ ప్రియదర్శి స్లాంగ్ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందనీ చెప్పవచ్చు.
  • జాతి రత్నాలు -నవీన్ పోలిశెట్టి: ఈ ఏడాది విడుదలైన జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇందులో నవీన్ పోలిశెట్టి అచ్చమైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఎంతో సందడి చేశారు
  • లవ్ స్టోరీ -నాగ చైతన్య: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు తెలంగాణ యాసతో ప్రేక్షకులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Featured

Pitapuram: ఒక్క పిఠాపురంలోని 500 కోట్ల బెట్టింగ్.. ఉత్కంఠత రేపుతున్న ఎన్నికల ఫలితాలు!

Published

on

Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.

Advertisement

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత..
ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Advertisement
Continue Reading

Featured

Laya: అమెరికాలో అడుక్కు తింటున్నా.. రోల్స్ పై ఎమోషనల్ అయిన లయ?

Published

on

Laya: సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో లయ ఒకరు. ఈమె హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అయితే ఈమె నటించిన మొదటి సినిమాకే నంది అవార్డు రావడం విశేషం ఇలా హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఈ విధంగా లయ పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు ఇక పెళ్లి తర్వాత ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుత తన కూతురితో కలసి సోషల్ మీడియాలో ఈమె చేసే హంగామా మామూలుగా లేదు అదే విధంగా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ప్రస్తుతం నటుడు నితిన్ హీరోగా నటిస్తున్నటువంటి తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటిస్తున్నటువంటి తరుణంలో లయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

రోడ్డుపై పడ్డాను..
తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్నాను అయితే తాను అమెరికాలో ఉన్నాననే విషయం తెలియడంతో చాలామంది నాపై ట్రోల్స్ చేశారు. అమెరికాలో నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని అడుక్కు తింటూ రోడ్డుపై పడ్డానని చాలామంది విమర్శలు చేశారు . అయితే ప్రస్తుతం ఇలాంటి వాటి గురించి పట్టించుకోవడం లేదంటూ లయ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పార్టీ గెలిస్తే పవన్ ఎనర్జీ లెవెల్ కు ఆ పదవే కరెక్ట్ అంటున్న ఫ్యాన్స్?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై చాలా ఫోకస్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఈసారి జనసేన పార్టీ సింగిల్ గా కాకుండా తెలుగుదేశం అలాగే బిజెపితో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుందని వెల్లడించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ విషయంలో ఓ డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఏ పదవి ఇస్తారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కి ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ కు ఆయనకు తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హోం శాఖ మంత్రి అయితే శత్రువుల పాలిట సింహ స్వప్నంలా మారతారని ఆయనకు అదే కరెక్ట్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

హోం శాఖ మంత్రి..
ఇలా పవన్ అభిమానులు చేసే ఈ కామెంట్లపై వైసీపీ ఫ్యాన్స్ స్పందిస్తూ ముందు పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా గెలవనివ్వండి తర్వాత హోంశాఖ గురించి ఆలోచిస్తారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజక వర్గంపై రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొందని చెప్పాలి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!