Renu Desai: సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈయన గెలిచినప్పటి నుంచి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన కుమారుడు అకీరా తన తండ్రి వెంటే ఉంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సైతం ఆయన ఎక్కడికి వెళ్లిన తన కొడుకుని కూడా వెంట తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు తన భార్య అన్నాతో పాటు అకీరాని కూడా వెంట తీసుకు వెళ్లి చంద్రబాబు నాయుడుకి పరిచయం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసిన సంగతి తెలిసిందే
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. అయితే వ్యక్తిగతంగా రేణు దేశాయ్ బిజెపి పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు గతంలో కూడా ఈమె ఈ పార్టీని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేశారు.
మాటలు రావడం లేదు..
ఈ క్రమంలోనే తన కుమారుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడంపై ఈమె సంతోషం వ్యక్తం చేస్తూ..ఇవాళ నా కొడుకు అకీరాని పీఎం నరేంద్రమోదీ గారి పక్కన చూడటం ఎంతో ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది కానీ మాటలు రావట్లేదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిసాక అకిరా నాకు కాల్ చేశాడు. మోదీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, అయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అంటూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.





























