RGV : ఇండస్ట్రీ లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం గురించి రామ్ గోపాల్ వర్మ తన మార్కు కామెంట్స్ చేసారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ గురించి మాట్లాడుతూ నిర్మాతకు ఒక ఆర్టిస్ట్ ను సినిమాలో పెట్టుకుంటే సినిమాకు ప్లస్ అవుతుంది అన్నపుడు ఖచ్చితంగా అతనికి ఇవ్వడానికి వెనుకాడడు. అలాంటప్పుడు డిమాండ్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఎందుకు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి. ఇక ప్రేక్షకులు లేకపోతే సినిమా ఉండదు అంతే కానీ నిర్మాత లేకపోతే కాదు వంటి హాట్ కామెంట్స్ చేసారు రామ్ గోపాల్ వర్మ.

రాజమౌళి ఇండస్ట్రీని నాశనం చేసాడు…
ఇక సినిమా చూడడానికి ఒక ప్రేక్షకుడు థియేటర్ కి రాకపోడానికి కారణాలను వివరిస్తూ టికెట్ రేట్స్, ఓటీటీ మధ్యమాలు కారణం కాదని అభిప్రాయపడ్డారు. టికెట్ రేట్లు ఎక్కువున్న సమయంలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి సినిమాలను చూసారు. వాటి తరువాత వచ్చిన ఆచార్య ను జనాలు థియేటర్ కి వచ్చి చూడలేదు. టికెట్ రేట్లు, ఓటీటీ ఇవన్నీ స్పెక్యూలేషన్ మాత్రమే నిజాలు కావు. నా అభిప్రాయం ప్రకారం సినిమా చుడడానికి జనాలు రాకపోడానికి కారణం రాజమౌళి చేసిన రెండు తప్పులు అంటూ చెప్పారు. ఒక తెలుగు సినిమా తీస్తే రెండు వేల కోట్ల మార్కెట్ చేయగలదని రాజమౌళి చూపించాడు. ఇక ఒక సినిమా క్వాలిటీ విషయంలో మరే సినిమాకు అందని ఎత్తులో ఉన్నాడు.

దీనివల్ల ఆర్ఆర్ఆర్ వంటి సినిమా చూసాక మిగిలిన సినిమాలను చూడాలని సగటు ప్రేక్షకుడికి అనిపించడం లేదు. తెలుగు లో ఒక సామెత ఉంది కదా రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి చూసాక మొత్తబుద్దేసింది అని అలా ఉంది పరిస్థితి. అలాంటి క్వాలిటీ సినిమా చూసాక మిగిలిన సినిమాలు ఒక పెద్ద హీరోవే అయినా జనాలకు చూడాలనిపించడం లేదు. ఇక ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలని వీళ్ళే కోరుకుంటున్నారు, అదే సమయంలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగా ఉండే సినిమా తీయాలనీ అంటున్నారు అంటూ నిర్మాతల గురించి అన్నారు. ఇండస్ట్రీ లో ఇప్పుడున్న డైరెక్టర్స్ రాజమౌళి ఎప్పుడు ప్లాప్ అందుకుంటాడా అని ఎదురుచూస్తున్నారు. రెండో విషయం రాజమౌళి ని ఎప్పుడు అందుకుంటాం అని ఆలోచిస్తున్నారు. ఇక సినిమా తీస్తున్న వాళ్ళు వాళ్ల సినిమాలో లోపాలను చూడటం లేదు సినిమా టికెట్ ధర, ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ను సాకుగా చూపుతున్నారు అంటూ కామెంట్స్ చేసారు ఆర్జీవి.






























