Sada Nannu Nadipe: హీరో ప్రతీక్ ప్రేమ్ కరణ్, వైష్ణవి పట్వర్ధన్ జంటగా నటించిన తాజా చిత్రం సదా నన్ను నడిపే. ఈ సినిమాకు హీరో ప్రతీక్ ప్రేమే దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. వీరితో పాటుగా ఈ సినిమా లో రాజీవ్ కనకాల,నాజర్, నాగేంద్రబాబు, అలీ, రంగస్థలం మహేష్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. స్వచ్ఛమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకత్వం,స్క్రీన్ ప్లే, సంగీతాన్ని హీరో ప్రతీక్ అందించారు.
కథ: ఇందులో మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సాహాని (వైష్ణవి పట్వర్దన్) ప్రేమిస్తూ ఉంటాడు. అయితే ఆమె ఎంత కాదన్నా కూడా ఆమెనే ఎంతో సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా మైఖేల్ జాక్సన్ ప్రేమని అంగీకరించడు. దీనితో మైఖేల్ జాక్సన్ ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ,మొత్తానికి మైఖేల్ జాక్సన్ సాహాని వివాహం చేసుకుంటాడు. కానీ సాహా మాత్రం పెళ్ళైన మొదటి రోజు నుంచే మైఖేల్ జాక్సన్ ని దూరం పెడుతుంది. పెళ్లి తర్వాత కూడా సాహా మైఖేల్ జాక్సన్ ను ఎందుకు దూరంగా పడుతుంది. దూరం పెట్టడానికి గల కారణం ఏమిటి? మరి మైఖేల్ జాక్సన్ చివరికి ఆమెకు దగ్గర అవుతాడా లేదా అన్న అంశాలతో ఈ సినిమాను చక్కగా తెరకెక్కించారు.
Advertisement
కథా కథనం విశ్లేషణ :ఈ సినిమా కంటే ముందు వచ్చిన కలిసుందాం రా, గీతాంజలి లాంటి సినిమాల మాదిరిగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ ఎంతో అద్భుతంగా ఎమోషనల్ గా, స్వచ్ఛమైన ప్రేమకథతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడం జరిగింది. అయితే మనకు బాగా కావాల్సిన వ్యక్తి చనిపోతున్నారు అని తెలిసిన తరువాత వారితో గడిపిన ఆ చివరి క్షణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటాం అన్నది ఇందులో బాగా చూపించారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంతకైనా తెగించే వచ్చు అన్న అంశాన్ని ఇందులో ఎమోషనల్గా తెరకెక్కించడంతో దానికి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు.
నటీనటుల పనితీరు :ఇందులో హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ ప్రేమ్ కరణ్ అద్భుతంగా నటించడంతో పాటుగా దర్శకత్వ బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహించారు. అదే విధంగా హీరోయిన్ కూడా తన పాత్రకు బాగా న్యాయం చేసింది. అలాగే ఇందులో కమెడియన్ ఆలీ ఉన్నంతవరకు బాగానే నవ్వులు పూజించాడు.
సాంకేతిక నిపుణుల పనితీరు :ఈ సినిమాలో సంగీతం బాగుంది. అలాగే నందు కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగుంది. అదే విధంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగా రిచ్ గా ఉంటుంది.
Advertisement
చిత్రం: సదా నన్ను నడిపే (UA)
రిలీజ్ డేట్: 2022-06-24
బ్యానర్: ఆర్ పి మూవీ మేకర్స్
Advertisement
నటీనటులు: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , వైష్ణవి పట్వర్ధన్, నాజర్, అలీ, రాజీవ్ కనకాల, రంగస్థలం మహేష్, జీవ తదితరులు
డీవోపీ: ఎస్ డి జాన్
ఎడిటర్: ఎస్ ఆర్ శేఖర్
Advertisement
మ్యూజిక్ డైరెక్టర్: ప్రతీక్ ప్రేమ్ కరణ్ , ప్రభు ప్రవీణ్
Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.
Advertisement
డ్రగ్స్ రాజధాని.. కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.
AP politics: ప్రస్తుతం జరగబోయే ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగ మారాయి. జగన్ ఒక్కడే ఒక వైపు ఉండగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇలా ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో మొదటిసారి చిలకలూరిపేట వద్ద ప్రజాగళం అనే పేరిట భారీ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు .అయితే ఈ సభలో మోడీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈయన తెలిపారు. ఎక్కడ కూడా జగన్ గురించి మాట్లాడలేదు అలాగే రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు పోలవరం గురించి ప్రశ్నించలేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడారే తప్ప జగన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఏకి ఓట్లు వేసి గెలిపించండి అని మాత్రమే కోరారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడుని గెలిపించడమే అజెండా కాదని ఈయన తెలిపారు.
Advertisement
జగన్ పై ఎక్కడ విమర్శలు చేయలేదు.. రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అలాగే జగన్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా మోడీకి అవసరం కనుక ఈయన ఎక్కడ కూడా జగన్ కు ఓటు వేయొద్దని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండని చెప్పలేదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి అనే అజెండా కనుక ఉండి ఉంటే ఈ సభలో జగన్ పై విమర్శలు చేసేవారు కానీ మోడీ ఎక్కడ కూడా అలా ప్రసంగించలేదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అనాలసిస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
AP politics: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పొలిటికల్ హీట్ మరింత పెరిగిపోయింది. వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు కానీ మరోవైపు టిడిపి జనసేన బిజెపి కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఇక ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈయన ప్రాంతాలవారీగా సిద్ధం సభలను ఏర్పాటు చేసి నాయకులలోను కార్యకర్తలను ఫుల్ జోష్ నింపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రచార కార్యక్రమాలలో భాగంగా సరికొత్త వ్యూహాలను రచిస్తూ జనాలలోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. ఈయన ఇప్పటికే ఏ నియోజకవర్గం లో ఎన్ని రోజులు పర్యటించాలి ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి ఎక్కడ రోడ్డు షో చేయాలి అనే విషయాల గురించి పక్కాగా ప్లాన్ సిద్ధం చేశారని తెలుస్తోంది.
2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి 151 స్థానాలలో విజయకేతనం ఎగురు వేసినటువంటి వైసీపీ పార్టీ ఈసారి మాత్రం వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది తాము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% అమలు పరిచాము. అందుకే వై నాట్ 175 అనే ధీమాతో జగన్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలను ఈసారి కూడా రిపీట్ చేయాలని ఈయన తన అభ్యర్థులను కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు.
Advertisement
వై నాట్ 175 ఇలా వై నాట్ 175 అంటూ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాగా మరోవైపు కూటమిగా అన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి పై యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు. మరి ఈ ఐదేళ్ల ప్రజా పాలనకు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తున్నారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.