శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన “ఫిదా” సినిమా ద్వారా పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. మొదటి సినిమా ఫిదాలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసిందని చెప్పవచ్చు.ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎంతో పేరు సంపాదించుకున్న సాయిపల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా ఒక పాన్ ఇండియా సినిమాలో చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తమిళం దిగ్గజ నిర్మాణ సంస్థ అయినటువంటి డ్రీమ్ వారియర్ బ్యానర్ పై లేడీ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈ కథకు గౌతమ్ రామ చంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నటించటానికి మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే ఆచితూచి కథలను ఎంపిక చేసుకుంటూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య సరసన నటించిన “లవ్ స్టోరీ” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా దగ్గుబాటి రానా హీరోగా “విరాటపర్వంలో” కూడా సాయి పల్లవి సందడి చేయనున్నారు. ఇక నాని “శ్యామ్ సింగరాయ్” లో కూడా నటిస్తున్నారు. ఈ తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ సినిమాలలో కూడా సాయి పల్లవి ఎంతో బిజీగా ఉన్న సమయంలో పాన్ ఇండియా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎంతో బిజీగా ఉన్నారు.



























