Collector Marraige: ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాలి. వారిని చూసి చాలా మంది ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. దేశంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ చేతల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు.

ప్రజల మన్నన పొందుతున్నారు. ఇటీవల పలువురు ఐఏఎస్ అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో జాయిన్ చేయడంతో పాటు.. ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా.. ప్రభుత్వ సేవలపై ప్రజలకు మరింతగా అవగాహన, నమ్మకం పెరుగుతాయి.

తెలంగాణాలోని ఓ జిల్లా కలెక్టర్ తన ప్రత్యేకతను చాటుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేటకు చెందిన దంపతులు సురేశ్, నిర్మల తనయుడు మంద మకరంద్ ప్రస్తుతం నిజామాబాద్లో అసిస్టెంట్ కలెక్టర్గా చేస్తున్నారు.
ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్థన్..
కాగా అతని వివాహం కరీంనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయితేజితతో ఫిబ్రవరి 11న హైదరాబాద్ శివారులోని నార్సింగి వద్ద ఓం కన్వెన్షన్లో జరిగింది. అయితే ఓ కలెక్టర్ పెళ్లి అంటే.. భారీ కార్లు, హంగామా ఉంటుంది సాధారణంగా. అయితే మకరంద్ మాత్రం సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు. కళ్యాణ మంటపానికి వరుడితో సహా అతని కుటుంబ సభ్యలు సిద్దిపేట ఆర్టీసీ బస్సులో చేరుకున్నారు. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా కలెక్టర్ ను అభినందించారు. ఆర్టీసీ ఎండీ బాజిరెడ్డి గోవర్థన్ పెళ్లికి హాజరై ప్రశంసించారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, సీపీ మహేశ్ భగవత్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ వివాహానికి హాజరై కలెక్టర్ దంపతులను ఆశీర్వదించారు.

































