Connect with us

Featured

సమంత, శర్వానంద్ “జాను” సినిమా రివ్యూ !!

Published

on

హీరో శర్వానంద్, టాలీవుడ్ క్వీన్ సమంత అక్కినేని జంటగా నటించిన చిత్రం జాను. విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ చిత్రం, తమిళనాట సంచలన విజయం సాధించిన 96 సినిమాకు రీమేక్. ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా.. “96” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ “జానూ” సినిమాకి కూడా ఈయనే దర్శకుడిగా కొనసాగారు. ఆ చిత్రానికి మ్యూజిక్ అందించిన గోవింద వసంత ఇక్కడ కూడా సంగీతం చేసారు. అయితే ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఈ సినిమా కధ ఏమిటి? “జాను” గా సమంత మెప్పించిందా ? తన నటనతో శర్వానంద్ ప్రేక్షకులను మరిపించగలిగాడా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం తెలుగునాట రీమేక్ ల పర్వం నడుస్తుంది. ఇది వరకు చాలా సినిమాలు ఇక్కడ రీమేక్ అయ్యాయి. అయితే రీమేక్ అయినా సినిమాలు అన్నీ హిట్ అవుతాయని గ్యారెంటీ లేదు. కానీ మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే రీమేక్ సినిమాలు అయినా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. ఇదివరకే ఇది చాలా సార్లు రుజువయ్యింది. అయితే రీమేక్ సినిమాలకు ఉన్నన్ని కష్టాలు, కంపేరిజన్లు రెగ్యులర్ సినెమాలకు ఉండవు. సినిమా కథతో పాటుగా ఇక్కడ నేటివిటీకి తగ్గట్టుగా కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటారు దర్శకులు. అందులో తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా అక్కడ విజయ్ సేతుపతి నటనకు, ఇక్కడ శర్వానంద్ నటనను పోల్చడం మొదలుపెడతారు. అక్కడ కథానాయికగా నటించిన త్రిష నటనకు ఇక్కడ సమంత నటనను పోల్చడం వంటివి నాచురల్ గానే జరుగుతుంటాయి. వీటి గురించి లోతుగా విశ్లేషణకూడా సోషల్ మీడియాలో మొదలైంది.

Advertisement

ఇన్ని విశ్లేషణలు, పోలికల మధ్య “జాను” ప్రేక్షకులను ఆకట్టుకోవడం మెమోలు విషయంకాదు. ఇక కథలోకి వెళితే లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటతో మొదలైన ఈ సినిమా, చాలా సంవత్సరాల తరువాత స్కూల్ రెయూనియన్ వేడుకలో కలుసుకున్న ప్రేమ జంట. రామ్ & జాను ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం, ప్రేమ ఉన్నా ఎప్పుడూ చెప్పుకోకపోవడంతో కలవలేకపోతారు. ఫ్లాష్ బ్యాక్ స్కూల్ ఎపిసోడ్ మాత్రం హైలైట్ గా నిలిచింది. అందరిని ఆకట్టుకుంటుంది. చిన్ననాటి రామ్, జానూ పాత్రలు చూడ చక్కగా ఉంటాయి. అయితే రెయూనియన్ తరువాత పెళ్లి చేసుకుని సింగపూర్ లో సెటిల్ అయి ఏకాంతంగా గడపాలని భావిస్తారు.. ఆ చిన్నపాటి ప్రయాణంలో జరిగే మధుర క్షణాలు, తరువాత ఏమి జరుగుతుంది అనేది మీరు వెండితెరపై చూడాల్సిందే. తమిళంలో “96” చిత్రాన్ని చూడకుండా “జాను” చిత్రాన్ని చుసిన వారికీ మాత్రం ఈ సినిమా మంచి ఫ్రెష్ అనుభూతినిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ముందుగా టైటిల్ పాత్ర పోషిస్తున్న మన “జాను” సమంత గురించి చెప్పుకోవాలి. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ సమంతకి కొత్తేమీకాదు కానీ ఈ చిత్రంలో ఆమె నటనతో ఆమె కెరీర్లో మరో అద్భుతమైన పాత్ర పోషించింది. హీరో శర్వానంద్ తో కెమిస్ట్రీని అద్భుతంగా పండించింది. ఆమె తప్ప వేరే ఎవరిని “జాను” క్యారెక్టర్ లో ఊహించుకోలేనటగా ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను మరిపించింది. మొత్తానికి ఈ సినిమాకు మంచి మార్కులు కొట్టేసింది సమంత.

ఇక శర్వానంద్. మనస్సులోని బాధలు బయటకి అస్సలు బయటపెట్టకుండా క్రమశిక్షణ తో మెలిగే “రామ్” క్యారెక్టర్ లో శర్వానంద్ ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడనే చెప్పాలి. లవ్ ఫెయిల్యూర్ అయినా ప్రతి వ్యక్తి రామ్ పాత్రలో తమను తాము ఊహించుకుంటారు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగాడు తన నటనతో.. అయన నటనతో పాటుగా అయన వాయిస్ ఈ సినిమాకి మరో అదనపు బలం. శర్వానంద్ కెరీర్ బెస్ట్ సినిమాగా “జానూ” నిలుస్తుంది.

Advertisement

ఇతర పాత్రలలో “వెన్నెల కిషోర్”, శరణ్య (ఫిదా ఫెమ్), రఘుబాబు తదితరులు వారి పాత్రలకు తగ్గట్టుగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చిన్ననాటి స్కూల్ పాత్రలకు రామ్, జానూ పత్రాలు పోషించిన సాయి కిరణ్, గౌరీ కిషన్ అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరిని తన దృశ్యకావ్యానికి కనెక్ట్ అయ్యేలా స్వచ్ఛమైన హావభావాలు రాబట్టుకోవడంలో దర్శకుడు “ప్రేమ్ కుమార్” సఫలం అయ్యారనే చెప్పాలి. ఫ్లాష్ బ్యాక్ లోని చిన్నప్పటి రామ్, జానూ క్యారెక్టలను సెలెక్ట్ చేయడంలోనే దర్శకుడు సగం విజయం సాధించాడు. ప్రేక్షకులు మళ్ళి మళ్ళి వచ్చి చూడటానికి ప్రేరేపించేలా అయన ఈ సినిమాని అద్భుతంగా “జాను”ను తెరకేకించారు. తమిళంలో చేసిన మ్యాజిక్ ఇక్కడ కూడా రిపీట్ చేయడం కోసం దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. సంగీత దర్శకుడు గోవిందా వసంత కూడా తన సంగీతంతో ప్రేక్షకులను మైమరపించారు. మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరో అసెట్.

ఇక ఫైనల్ గా కథలో కథనంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా “96” చిత్రాన్ని అలాగే దింపేసాడు దర్శకుడు. సో 96 చిత్రాన్ని చూడని వారు ఈ చిత్రానికి బాగానే కనెక్ట్ అవుతారు. ఈ సినిమా కాస్త స్లో గా అనిపిస్తుంది. కానీ శర్వానంద్, సమంతల కెమిస్ట్రీ కోసం, సమంత, శర్వానంద్ ల నటన కోసం ఈ సినిమా కచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిందే.

ఇంకా ఏంటి అండి… రేటింగ్ కోసం చూస్తున్నారా ? సినిమా బాగుంది రేటింగ్ తో పనేముంది చూసేయండి ఒక పనైపోతుంది.

Advertisement

Continue Reading
Advertisement

Featured

Magadheera: చరణ్ అభిమానులకు శుభవార్త.. థియేటర్లో రిలీజ్ కాబోతున్న.. ఎప్పుడో తెలుసా?

Published

on

Magadheera: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే తెలుగు థియేటర్స్ లో చాలా సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రభాస్ చిరంజీవి బాలకృష్ణ,రామ్ చరణ్,ఎన్టీఆర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. పోకిరి నుంచి ఇప్పటిదాకా రీసెంట్ గా సమరసింహా రెడ్డిదాకా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. కొన్ని రీరిలీజ్ సినిమాలు బాగానే డబ్బు చేసుకోగా మరికొన్ని మాత్రం జనం పెద్దగా పట్టించుకోని పరిస్దితి ఏర్పడుతోంది.

ఆ సంగతి పక్కన పెడితే త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమా విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అన్న వివరాల్లోకి వెళితే.. మగధీర సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మగధీర చిత్రాన్ని 26న రీ రిలీజ్‌ చేస్తున్నారు మేకర్స్‌. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించిన మగధీర 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌ బస్టర్‌ హిట్ గా నిలిచింది.

రీ రిలీజ్‌..

Advertisement

దాదాపుగా 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్‌ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్‌ చేస్తున్నారు. మగధీర చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్‌ చేస్తున్నాము. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి అని తెలిపారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌ బాబు.

Advertisement
Continue Reading

Featured

Mokshagna: బోయపాటి డైరెక్షన్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ.. ఫిక్స్ చేసిన బాలయ్య?

Published

on

Mokshagna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. ఈయనకు వయస్సు మీద పడుతున్నప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక బాలయ్య వారసుడి రాక కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Mokshagna

మోక్షజ్ఞ ఎంట్రీ అదిగో ఇదిగో అంటూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి అభిమానులను ఊరిస్తూ ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఈయన సినీ ఎంట్రీ గురించి ఎలాంటి క్లారిటీ లేదు కానీ గత ఏడాది బాలయ్య మాట్లాడుతూ వచ్చే ఏడాది తన కుమారుడు సినీ ఎంట్రీ ఉంటుందని తెలిపారు.. ఇకపోతే మోక్షజ్ఞ ఎవరి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతారన్న సందేహాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. ఒకసారి అనిల్ రావిపూడి పేరు వినిపించగా మరోసారి బోయపాటి పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఇప్పటికే వీరిద్దరూ స్క్రిప్ట్ గురించి కూడా డిస్కషన్స్ పూర్తి చేశారని ఇక త్వరలోనే ఈ సినిమా పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఇలా బాలయ్య తన కొడుకు ఎంట్రీ బోయపాటి పైనే భారం వేసారని తెలుస్తోంది ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

బోయపాటి పైనే భారం..
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి తాజాగా మరొక వార్త వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి టైం ఫిక్స్ చేశారని ఇక ఈయన బోయపాటి డైరెక్షన్ లోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలుస్తుంది. మాస్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ తన కుమారుడి మొదటి సినిమా కూడా ఇలాంటి యాక్షన్ టచ్ ఇస్తేనే బాగుంటుందని భావించినటువంటి బాలయ్య బోయపాటిని ఫిక్స్ చేశారట.

Advertisement
Continue Reading

Featured

Venkata Chaitanya: ప్రతి ఒక్కటి తిరిగి ఇచ్చేయాల్సిందే.. వైరల్ అవుతున్న నిహారిక మాజీ భర్త పోస్ట్!

Published

on

Venkata Chaitanya: జొన్నలగడ్డ వెంకట చైతన్య పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ నిహారిక మాజీ భర్తగా ఈయన ఎంత గుర్తింపు పొందారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమ్మతితో వీరిద్దరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి వీరిద్దరూ తమ వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా నిహారిక ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె తన పెళ్లి విడాకులు అలాగే రెండో పెళ్లి గురించి కూడా కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే .ఇలా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇందుకు కౌంటర్ గా తన మాజీ భర్త సైలెన్స్ సైలెన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

అయితే తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈయన పరోక్షంగా నిహారికను ఉద్దేశిస్తూ తనకు కౌంటర్ ఇస్తూనే ఇలాంటి పోస్టులు చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయినటువంటి చైతన్య తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పాజిటివిటీని పెంచాలి..
చాలా రోజుల తర్వాత ఇలా మళ్లీ రాసుకు వస్తున్నాను. ఇంస్టా కమ్యూనిటీకి నా వల్ల అయినంతలో ఇలా చిన్నగా అయిన తిరిగి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. కొంచమైనా పాజిటివిటీని పెంచాలని అనుకుంటున్నాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో ఇది చూసినటువంటి నేటిజన్స్ కచ్చితంగా ఇది నిహారికను ఉద్దేశించి చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయిన సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు ఇలా పరోక్షంగా సెటైర్లు వేసుకుంటూ పోస్ట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!