Naga Chaitanya – Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు గత ఏడాది అక్టోబర్ 2వ తేదీ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఈ జంట సుమారు రెండు నెలలపాటు విడిగా ఉంటున్నారు.

ఇలా గత ఆరు నెలల నుంచి వీరిద్దరూ విడి విడిగా ఉంటూ వారి కెరియర్ పై ఫోకస్ చేశారు. అయితే ఈ జంట తిరిగి కలిస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ వీరిద్దరూ తిరిగి కలవాలని కోరుకున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు బట్టి చూస్తుంటే వీరిద్దరు కలవరని అర్థమైంది.

ఈ విషయంలో ఇరు కుటుంబాల సభ్యులు కూడా వీరికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇలాంటి సమయంలోనే సమంత తన విడాకులకు సంబంధించిన పోస్ట్ ను డిలీట్ చేయడంతో ప్రతి ఒక్కరూ మరి వీరిద్దరూ కలుస్తారా అని ఆశలు పెట్టుకున్నారు. అయితే నాగచైతన్య వైపు నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో సమంత ఈ పోస్ట్ అనవసరమని డిలీట్ చేశారని భావించారు.
లీగల్ ప్రొసీడింగ్ ప్రాసెస్ పూర్తి అయితే..
ఇప్పటికే వీరి విడాకుల గురించి లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్ కూడా పూర్తయితే పూర్తిగా అధికారికంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య అభిమానులు వీరిద్దరూ కలుస్తారని ఆశల పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇక వీరిద్దరూ కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.


























