Samantha: నాగచైతన్యతో విడాకుల అనంతరం నుంచి సమంత వరసపెట్టి సినిమాలు చేస్తోంది. విడాకులుకు ముందు అక్కినేని ఫ్యామిలీగా, నాగార్జున కోడలిగా, నాగచైతన్య భార్యగా సమంతకు కొన్ని పరిమితులు ఉండేవి. ఎప్పుడైతే విడాకుల వచ్చాయో అప్పటి నుంచి సమంత ఫ్రీ బర్డ్ అయిపోయింది.

వరసగా సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇటీవల పుష్ప సినిమాలో ‘ ఊ అంటావా మావా ఊఊ అంటావా’ పాటతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ కు కమ్ బ్యాక్ అయింది సమంత. ఈ పాట కూడా పెద్ద హిట్ సాధించింది. సమంత అందాలు, దేశీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ తో పాట సూపర్ డూపర్ హిట్ అయింది.

యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సంపాదించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్ లో ప్యాన్ ఇండియా సినిమా ‘ శాకుంతలం’ చేస్తోంది. ‘యశోద’ అనే మరో సినిమా చేస్తోంది. మరికొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
రూ.1.5 కోట్లు తీసుకొని.. రూ.5 కోట్లు అని చెబుతావా..?
ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం దాదాపుగా నిర్మాతలు సమంతకు రూ. 1.5 కోట్లు ముట్టచెప్పారు. పూర్తి సినిమా చేసిన హీరోయిన్లకు కూడా ప్రస్తుత 2-3 కోట్లే ఇస్తున్నారు. అలాంటిది కేవలం ఓ ఐటెం సాంగ్ కోసం ఇంత మొత్తం ఇవ్వడం టాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. ఇదిలా సమంతకు ఇచ్చిన మొత్తం టాలీవుడ్ కు పెద్దదే అయినా… బాలీవుడ్ కు మాత్రం చిన్నదే అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఓ హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఐటెం సాంగ్ కు రూ. 5 కోట్లు తీసుకున్నట్లు చెప్పింది. ఈ మాత్రం తీసుకున్నా అని చెబితే రానున్న రోజుల్లో బాలీవుడ్ లో ఇంతకు మించి అడగొచ్చని సమంత లెక్కలేసుకున్నట్లు ఉంది. అయితే ఇది తెలిసిన బాలీవుడ్ సినీ ప్రముఖులు.. పుష్ప నిర్మాతలను ఆరా తీయగా.. మేం రూ. 1.5 కోట్లు మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు. దీంతో బాలీవుడ్ మీడియా సమంతను ట్రోల్ చేయడం ప్రారంభించింది. బిల్డప్ కు పోయి అడ్డంగా బుక్కయింది సమంత

































