Samantha: సినీ నటి సమంత గురించి ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈయన ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంతకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

సమంత ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సమయంలో చాలా తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకునేవారు అయితే ఈమె బెల్లం కూడా సురేష్ బాబు కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు శీను అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా సమయంలో సమంత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యారు అంటూ ఈయన తెలియజేశారు.
ఆ సమయంలో ఈమె స్కిన్ డిసీస్ తో బాధపడుతూ ఉండేవారు అయితే ఈ సమస్య రావడంతో కొన్నాళ్లపాటు షూటింగులకు కూడా దూరంగా ఉన్నారని ఆ సమయంలో తాను తనకు చికిత్స కోసం 25 లక్షల రూపాయల డబ్బు ఇచ్చానని అలాగే ఆమె ప్రేయసి కోసం ఒక స్టార్ హోటల్ బుక్ చేసి అక్కడే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుందని తెలియజేశారు.

Samantha: బెల్లంకొండ సురేష్..
ఇలా సమంతకు ఈయన డబ్బులు ఇచ్చిన ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడంతో పలువురు విభిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంతకు ఈయన చేసిన సహాయం పట్ల ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కూడా సమంత మరో భయంకరమైన వ్యాధికి కూడా గురైన సంగతి తెలిసిందే. మయో సైటిసిస్ వ్యాధికి గురై ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే.



























