Samantha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సమంత ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే సినిమా విడుదలైన మొదటి రోజు నుండి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోయింది.

ఈ రేంజ్ ఫెయిల్యూర్ ఆమెకు ఈ పదేళ్లలో ఎదురుకాలేదు. పైగా శాకుంతలంలో ఆమె లీడ్ రోల్ లో నటించటం వల్ల సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆమె బాధ్యత వహించాల్సిందే. సినిమా మీద హైప్ క్రియేట్ చేయటానికి సినిమా యూనిట్ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో సమంత సింపతీ కార్ట్ కూడా వాడారనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా ప్రమోషన్స్ సమయంలో సమంత అనారోగ్యం గురించి మాట్లాడటం కన్నీళ్లు పెట్టుకోవడం కూడా సినిమాని సక్సెస్ చేయటానికి చేసిన ప్రయత్నమే అని కొందరు ఎద్దేవా చేశారు.
సమంత ఎంత ఏడ్చినా కూడా సినిమా బాగా లేకపోతే ప్రేక్షకులు పట్టించుకోరు. ఈ క్రమంలో సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సినిమాలో శకుంతలగా ఆమె నటన, డబ్బింగ్ కూడా పేలవంగా ఉన్నాయని టాక్ . తాజాగా సినిమా ఫెయిల్యూర్ గురించి పరోక్షంగా బాధ్యత వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహాభారతంలోని ఒక శ్లోకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహాభారతంలోని శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత నుండి …

Samantha: ఫలితం మన చేతుల్లో లేదు…
‘కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన
మా కర్మ ఫల హే తుర్ భూః
మా తే సంగోత్స్వ కర్మణి..’ శ్లోకాన్ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంటే ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం మనం నిర్ణయించలేము. ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానకుండా… ఏదేమైనా ముందుకు సాగిపోవాలని అర్థం . అంటే సినిమా ప్లాప్ అయ్యిందని బాధ పడకుండా ముందుకు సాగిపోవాలని పరోక్షంగా వెల్లడించింది.































