ప్రస్తుతం ఈ కరోనా కారణంగా చాలా ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ఉద్యోగస్తులు అందరూ ఇంటినుంచి పనులు చేయడం ప్రారంభించారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వల్ల చాలా మందిలో తీవ్రమైన వెన్ను నొప్పి, మెడనొప్పితో సతమతమవుతున్నారు. ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందాలంటే తప్పనిసరిగా ఈచిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ఒక ఉద్యోగి ఆఫీసులో పని చేయడానికి ఇంటి నుంచి పని చేయడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆఫీసులో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి ఉంటారు కనుక ఏ విధమైనటువంటి సమస్యలు చుట్టుముట్టావు. కానీ ఇంటి నుంచి పని చేసేటప్పుడు ఎన్నో సమస్యలు వెంటాడతాయి. దీని కారణంగానే ఎంతోమంది మెడనొప్పి, తీవ్రమైన నడుము నొప్పి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు వారు పనిచేసే సమయంలో ప్రతి గంటకు కాస్త విరామం తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి దూరం కావచ్చు. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల నొప్పులు అధికమవుతాయి.అదేవిధంగా మీ భుజాలను మోకాళ్ళను వంచి పని చేసేటప్పుడు ఈ నొప్పులు మరింత తీవ్రతరం అవుతాయి కనుక కొద్దిగా ఎత్తులో కూర్చుని పని చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మీరు ఉపయోగించేటటువంటి లాప్టాప్, మొబైల్ స్క్రీన్ లను సరైన క్రమంలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఎల్లప్పుడు మీ కంటికి మీ మానిటర్ సమాంతరంగా ఉండే విధంగా చూసుకోవాలి . రోజంతా కూర్చుని పని చేయటం వల్ల మనపై అధిక ఒత్తిడి పడుతుంది కనుక ప్రతి రోజు సాయంత్రం తగిన వ్యాయామాలు చేయటం లేదా కాసేపు నడవడం వంటివి చేయడం ద్వారా ఈ విధమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.



























