Senior actor GV Narayana rao : అంతులేని కథ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు జీవీ నారాయణ రావు గారు ఆ సినిమా తరువాత హీరోగాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక ప్రొడ్యూసర్ గా మారి చిరంజీవి గారితో దేవాంతకుడు, అలాగే ఫ్రెండ్స్ తో కలిసి యముడికి మొగుడు సినిమాలను తీసి మంచి హిట్స్ అందుకున్నారు. ఇక చిరంజీవి గారితో స్నేహితులతో కలిసి సినిమా నిర్మిస్తున్న సమయంలో వచ్చిన విబేధాలు వంటి విషయాల మీద అయన మాట్లాడారు.

రైట్స్ రాయించుకుని ఐదు లక్షలు ఇచ్చారు…
హిందీ సినిమా కథను తీసుకుని ఇద్దరు హీరోలు ఉన్న స్టోరీ ని మార్చి ఒక హీరో కథగా చేసి చిరంజీవి గారితో ‘దేవాంతకుడు’ సినిమా తీసి హిట్ అందుకున్నారు జీవీ నారాయణ రావు గారు. ఇక ఆ సినిమా ఘన విజయం సాధించడంతో చిరంజీవి గారు పిలిచి తన పాత రూమ్మేట్స్ అయిన సుధాకర్, హరిప్రసాద్ లను కలుపుకుని ఒక సినిమా చేద్దాం, నీకు అనుభవం ఉంది వాళ్లకు డబ్బు వస్తుంది అని చెప్పడం వల్ల డైనమిక్ బ్యానర్స్ అనే సంస్థను పెట్టి ‘యముడికి మొగుడు’ సినిమాను తీశారు.

అయితే ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే పది లక్షలు ఎక్కువ అవడంతో ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో చిరంజీవి సినిమా ఎలా అనుకున్నారో అలా తీయండి మీకు చెరో ఐదు లక్షలు లాభం వచ్చేలా నేను చూసుకుంటా అని హామీ ఇచ్చారు. దీంతో అరవింద్ గారు ఎలాగూ చిరంజీవి గారు మాటిచ్చారు కదా చెరో ఐదు లక్షలు తీసుకోండి సినిమా రైట్స్ చిరంజీవి, సురేఖ మీద రాసిచ్చేయండి అని చెప్పి ఐదులక్షలు ఇచ్చారు. ఎలాంటి విబేధాలు రాకుండా సినిమా అయింది. సినిమా వల్ల అందరూ లాభంపడ్డాము అంటూ చెప్పారు. ఇక ఆ సమయంలో హరిప్రసాద్ గారికి చిరు కి విబేధాలు వచ్చాయి అన్నది ఒట్టి పుకారు అంటూ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ తరుపున ఖమ్మం జిల్లాకు పనిచేస్తున్న హరిప్రసాద్ ఒక న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొనగా అక్కడే గుండె పోటు రావడం హాస్పిటల్ తీసుకెళ్లినా మరణించాడు, లైవ్ లో అలా జరిగింది. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో తెలియదు అంటూ ఎమోషనల్ అయ్యారు.
































