Senior Actress Lakshmi Priya : తెలుగులో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లోనూ నటిస్తున్న నటి లక్ష్మి ప్రియ గారు. ఎన్నో సినిమాల్లో అమ్మగా అత్తగా అలరించిన లక్ష్మి ప్రియ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆమె కెరీర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘ప్రాణస్నేహితులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మి ప్రియ గారు చాలా సినిమాల్లో నటించారు. తొలుత హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చినా అవకాశాలు అంతగా రాకపోవడం వల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిన ఆమె చిరంజీవి గారితో ఆమెకున్న అనుబంధం పంచుకున్నారు.

నువ్వేమన్నా రజినీ కాంత్ అనుకున్నావా అనే దాన్ని…
చిరంజీవి గారు ఇంకా అవకాశాల కోసం కస్టపడుతున్న సమయంలో ‘అగ్ని సంస్కారం’ అనే సినిమాలో నటించారు. అందులో చిరంజీవి గారు హీరో కాగా భావన అనే నటి హీరోయిన్. అయితే అందులో లక్ష్మి ప్రియ గారు ఒక క్యారెక్టర్ చేశారట. ఆ సమయంలో చిరంజీవి కాంబినేషన్ లో సీన్ చేసేటపుడు చిరంజీవి గారు లక్ష్మి ప్రియ ను నువ్వేమన్నా వాణిశ్రీ అనికుంటున్నావా ఆ డైలాగు చెప్పడం ఏమిటి అని సరదాగా అనేవారట.

ఇక లక్ష్మి ప్రియ గారు కూడా నువ్వేమన్నా రజినీ కాంత్ అనుకుంటున్నావా అంటూ ఇద్దరం తిట్టుకునే వాళ్ళమని, ఇప్పుడు ఇంత పెద్ధ హీరో అయిపోతాడని అసలు ఊహించలేదని, చాలా ఏళ్లకు మళ్ళీ ఒకసారి కనిపించినా మొదట్లో పలకరించినంత అభిమానంతోనే నన్ను పలకరించారని, అప్పటికి మెగాస్టార్ అయిపోయాడని అయినా నన్ను గుర్తు పెట్టుకున్నందుకు చాలా ఆనందంగా అనిపించిందంటూ లక్ష్మి ప్రియ వివరించారు.
































