Senior Journalist Bhardwaja : తెలుగులో హీరోయిన్ గా అగ్ర స్థానంలో ఉన్న సమంత నాగచైతన్య తో వివాహం జరిగి అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లిన కూడా సినిమాలను చేస్తూ తనని తాను ఛాలెంజింగ్ పాత్రలతో నిరూపించుకుంటూ వచ్చింది . అయితే ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అనుకున్న ఆమె మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకెళ్ళింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంది. ఇక అంత బాగుందనుకునే లోపే సమంత ఆటో ఇమ్మ్యూన్ సమస్యతో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయ్యారు. అయితే సమంత యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సుమతో ఇంటర్వ్యూ లో పాల్గొన్న సమయంలో చాలా ఎమోషనల్ గా తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం ఇదంతా బాగా వైరల్ అయింది. ఇక ఇప్పుడు తాజాగా సమంత చేసిన ట్వీట్ మరోసారి ఆమె ఆరోగ్యం గురించి అనుమానలను రేకేత్తిస్తున్నాయి. వీటి గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

ఆ వ్యాధికోసం థెరపీ తీసుకుంటున్న సమంత….
మాయొసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత కోలుకుందా లేదా అనే సందేహల నడుమ తానే ట్వీట్టిర్ ద్వారా తన ఆరోగ్యం గురించిన అప్ డేట్స్ ను సమంత పంచుకుంది. తాను రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి థెరపీ తీసుకుంటున్నట్లు చెప్పడం తో తాను ఇంకా వ్యాధితో బాధపడుతోందని అసలు సమంత కోలుకుని మాములు మనిషి అవుతుందానే సందేహాలు ఎక్కువయ్యాయి. వీటి గురించి భరద్వాజ గారు మాట్లాడుతూ తాను తన వ్యక్తిగత విషయలు ఏవైనా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటోంది.

రూమర్స్ లేకుండా తానే క్లారిటీ గా ఏం జరుగుతోందో తన జీవితంలో వివరిస్తోంది అంటూ చెప్పారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నా తాను మానసికంగా ఎంత స్ట్రాంగ్ గా ఉందొ చెప్తోంది. తాను సోషల్ మీడియా ద్వారా తాను మొదట థెరపీ సెషన్ ముగించుకున్నట్లు చెప్పింది. తొందర్లో కోలుకుంటున్నట్లు చెప్పడం ద్వారా నేను మళ్ళీ సినిమాల్లోకి వస్తాను అన్నట్లు సంకేతలు ఇచ్చిందంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా సమంత త్వరలో కోలుకుని మళ్ళీ తన నటనతో అందరిని మెప్పించాలి అంటూ ఆశభావం వ్యక్తం చేసారు.































