Senior Journalist Imandhi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు అశేష తెలుగు అభిమానులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. శరీరంలోని అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోవడంతో ఆయన మరణించినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. నవంబర్ 14న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల ఆయనను ఇంకా ఇబ్బంది పెట్టకూడదని భావించి కృష్ణ గారి కుటుంబం చికిత్స ఇక వద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణ వార్త వినగానే ఆయన అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. అంతటి లెజెండ్రి నటుడు మరణిస్తే ఆయన అంత్యక్రియలు సాధారణ వ్యక్తిలాగే మహాప్రస్థానంలో జరగడంతో అభిమానులు బాగా నిరాశ చెందారు. ఇక ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.

మహేష్, కృష్ణ గారికి న్యాయం చేయాల్సింది…
కృష్ణ గారి మరణం మహేష్ బాబు కి ఖచ్చితంగా తీరని లోటు. ఇటీవలే మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మరణం అపై కొద్ది రోజులకు కన్నతల్లి ఇందిరా దేవి గారు మరణించారు ఇంతలోనే కృష్ణ గారు మరణించడం ఈ ముడు మరణాలు మహేష్ ను ఒంటరిని చేసాయి. అయినా తండ్రి ని దేవుడితో పోల్చిన మహేష్ ఆయన మరణానికి న్యాయం చేయలేదంటూ ఇమంది గారు అభిప్రాయ పడ్డారు. ఆయన కడసారి చూపు కోసం చాలా మంది అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి చాల మంది వచ్చారు.

కానీ కృష్ణ గారిని కడసారి చూసే అవకాశం ఎవరికీ దక్కలేదు, కేవలం సెలబ్రిటీస్ మాత్రమే ఆయనను కడసారి చూసే అవకాశం కల్పించడంతో అభిమానులు అగ్రహానక్కి గురయ్యారు. ఇక ఆయన అంత్యక్రియలు పద్మాలయా స్టూడియోలో చేసి స్మారకంగా ఏదైనా చేసుంటే ఆయన అభిమానుల సందర్శనకు వీలుగా ఉండుంటే బాగుండేది. కానీ అలా కాకుండా మహా ప్రస్థానంలో సాధారణ వ్యక్తికి చేసినట్లు అంత్యక్రియలు చేయడం పట్ల ఆయన అభిమానులు నిరాశ చెందారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అభిప్రాయ పడ్డారు.


































