Senior Journalist Imandhi Ramarao : ‘బుద్ధిమంతులు’ సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టిన రంగనాథ్ గారు పుట్టింది మద్రాస్ అయితే టికెట్ కలెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు. అయితే ఒడ్డు పొడుగు ఉన్నావ్ సినిమాల్లో ప్రయత్నిచవచ్చు కదా అని చాలా మంది సలహాలు ఇవ్వడంతో సినిమాల్లో ప్రయత్నిచాలని భావించి అవకాశాల కోసం కష్టపడగా మొదట బుద్ధిమంతులు సినిమాతో నటుడయ్యారు. ఇక ఆ తరువాత ‘చందన’ సినిమాతో హీరో అయ్యారు. దాదాపు 300 వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన హీరోగా చేసి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాల్లో చేసారు.

శోభన్ బాబు తో గొడవలు…
రంగనాథ్ గారు హీరోగా అప్పుడప్పడే హిట్లు కొడుతున్న సమయంలో శోభన్ బాబు గారు చెప్పిన మాటలు రంగనాథ్ గారిని బాధపెట్టాయి అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. హీరోగా ఎదుగుతున్న సమయంలో శోభన్ బాబు గారిని వారాహి స్టూడియోలో పలకరించగా ఆయన నువ్వు ఎస్విఆర్, గుమ్మడి లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించు, నీకు లాంగ్ రన్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఉంటుంది, హీరోగా కొంత కాలమే నటించగలవు అని చెప్పారట. అయితే ఆ మాటలకు రంగనాథ్ గారు బాధపడ్డారట. హీరోగా బాగా రానిస్తున్న సమయాల్లో ఇలా ముసలి పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయమన్నారేంటి నన్ను చూసి ఆయన ఈర్ష్య పడుతున్నారా అని భాధపడ్డారట.

హీరోగా చేస్తున్న సమయంలో విలన్ గాను సినిమాలు చేయడంతో విలన్ అవకాశాలు రావడం ఎక్కువైంది, ఆ తరువాత రాను రాను రంగనాధ్ గారి అవకాశాలు సన్నగిల్లాయి, ఇక ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా పాత్రలను చేశారు. ఇక చివరికి సీరియల్స్ లోనూ నటించారు. ఆయన శోభన్ బాబు చనిపోయాక ఒకసారి ఇమంది గారితో ఆ రోజున శోభన్ బాబు గారు చెప్పిన మాటలు వినుంటే ఈ రోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా మంచి గగుర్తింపు తో ఉండేవాడిని కదా అంటూ బాధపడ్డారట. ఈ విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు తెలిపారు.

































