AP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం సొంత చెల్లెల పట్ల తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో భాగంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడారు వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డిని అనవసరంగా ఇరికిస్తున్నారని ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

వివేక బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి తప్పు ఏమాత్రం లేదని ఆయన తప్పు లేదని తెలిసి తాను టికెట్ ఇచ్చానని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన సొంత చెల్లెలు వైఎస్ఆర్ షర్మిల గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన తండ్రిని చంపినటువంటి శత్రువులతో కలిసి షర్మిల చేతులు కలిపిందని తెలిపారు.
పచ్చ చీర కట్టుకొని శత్రువుల వద్దకు వెళ్లి మోకరిల్లింది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగనన్న ఇలా ఒక ఆడబిడ్డ గురించి తన ఒంటిపై ఏ రంగు చీర ఉంది అనే విషయం గురించి వేల సంఖ్యలో మగవారి ముందు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ఈమె ప్రశ్నించారు.
రాజకీయాల కోసం దిగజారిన జగన్..
ఇప్పటివరకు సొంత చెల్లెలు ఒక ఆడబిడ్డ అయినటువంటి తనపై తన పేటీఎం కుక్కలు సోషల్ మీడియాలో నన్ను విమర్శించింది సరిపోలేదని నేడు అంత మంది మగవారి ముందు తన ఒంటిపై వేసుకున్నటువంటి చీర రంగు గురించి మాట్లాడటం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు. పసుపు రంగు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత భయం టిడిపి పసుపు రంగును కొనుకుందా మనం వంటల్లోకి ఉపయోగించేది కూడా పసుపు రంగే కదా నేను పసుపు పచ్చ చీర కట్టుకుంటే తప్పేంటి అంటూ ఈమె ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఈ విషయంలో షర్మిలకు భారీ స్థాయిలో మద్దతు లభించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి స్థాయి దిగజారి పోయిందంటూ పలువురు ఈ కామెంట్ల పై విమర్శలు చేస్తున్నారు.





























