శివసేన నేత గులాబ్రావ్ పాటిల్ చేసిన ప్రకటన తర్వాత రాజకీయ వాతావరణం వేడెక్కినట్లు కనిపించింది. గులాబ్రావ్ పాటిల్ చేసిన ప్రకటనపై పలువురు రాజకీయ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంత్రి గులాబ్రావు పాటిల్ క్షమాపణలు చెప్పారు.

బోద్వాడ్ నగర్ పంచాయతీ ప్రచార సభలో గులాబ్రావ్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర మహారాష్ట్రలోని తన జిల్లాలోని బోద్వాడ్ నగర్ పంచాయతీ ఎన్నికల కోసం శనివారం జరిగిన ఎన్నికల సమావేశంలో శివసేన సీనియర్ నాయకుడు అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పాటిల్ తన ప్రసంగంలో భాగంగా.. తన నియోజకవర్గంలో రోడ్లు ఎంత బాగున్నాయో చూడాలని ప్రత్యర్థులను కోరారు. ఎన్సీపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సేపై విరుచుకుపడిన ఆయన వీధులను నటి హేమమాలిని బుగ్గలతో పోల్చారు. గత 30 ఏళ్లుగా ఏక్నాథ్ ఖడ్సే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు . కానీ మంచి రోడ్లు వేయలేకపోయారన్నారు. మహారాష్ట్రలోని తన నియోజకవర్గం ధరంగావ్లో తాను వేసిన రోడ్లను వచ్చి చూడాలన్నారు. ఆ రోడ్లు ఎలా ఉన్నాయంటే.. హేమమాలిని బుగ్గలులాగా ఉన్నాయంటూ పోల్చాడు.
గులాబ్రావ్ పాటిల్ ఈ ప్రకటనతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో గులాబ్రావ్ పాటిల్ తన ప్రకటనను వక్రీకరించారని అన్నారు. స్పీచ్లో నేను చేసిన ప్రకటన వల్ల ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే, క్షమాపణలు కోరుతున్నాను అని గులాబ్రావ్ పాటిల్ అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంలో సీనియర్ నటి హేమమాలిని స్పందించారు. మంత్రిగారు అలా అనడం సరికాదని అన్నారు. అయితే ఇలా నటీమణులతో పోల్చడం అనేది కొత్త కాదు అని.. ఈ ట్రెండ్ని కొన్నేళ్ల క్రితం లాలూ ప్రసాద్ యాదవ్ ప్రారంభించారన్నారు. అందుకే అందరూ వాడుకున్నారు.
ఈ విషయంలో సామాన్యులు మాట్లాడితే బాగుంటుంది కానీ.. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ చెప్పారు. గులాబ్రావ్ పాటిల్ ఈ ప్రకటనతో బీజేపీ ఆయనపై విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో గులాబ్రావ్ పాటిల్ తన ప్రకటనను వక్రీకరించారని అన్నారు. స్పీచ్లో నేను చేసిన ప్రకటన వల్ల ఎవరి మనోభావాలు అయినా గాయపడి ఉంటే, క్షమాపణలు కోరుతున్నాను అని గులాబ్రావ్ పాటిల్ అన్నారు.































