Connect with us

Featured

MM Srelekha: నాయుడు గారు నన్ను, దాసరిని కోటి రూపాయలు పోగొట్టినందుకు తిట్టేవారు.. సంగీతం నేర్పమంటే బాలుగారు అలా అన్నారు: ఎం ఎం శ్రీలేఖ

Published

on

MM Srelekha: ఎం ఎం శ్రీలేఖ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ సంగీత దర్శకురాలు. ఈమె చిన్నప్పటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల తనకు కూడా సంగీతంపై ఎంతో మక్కువ ఏర్పడింది. శంకరాభరణం సినిమా చూసి తాను సింగర్ గా స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నానని శ్రీలేఖ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇకపోతే ఎం ఎం కీరవాణి అన్నయ్యతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అలా సంగీత దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

తన మొట్టమొదటి సినిమా తమిళ హీరో విజయ్ తో చేశానని తెలిపారు. ఇకపోతే కొండపల్లి రత్తయ్య సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహించానని,ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రామానాయుడు ఎప్పుడూ కూడా కోటిపల్లి రత్తయ్య అంటూ నన్ను దాసరి గారిని కలిపి తిట్టే వారు అంటూ ఈ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు.ఈ సినిమాకు దాసరి దర్శకత్వం వహించగా,తాను సంగీత దర్శకత్వం వహించానని ఈ సినిమా ఫ్లాప్ కావడంతో కోటి రూపాయలు నష్టం రావడం వల్ల నాయుడు గారు చనిపోయేవరకు మమ్మల్ని కోటి రూపాయలు గురించి ప్రస్తావిస్తూ తిట్టేవారు అంటూ సరదాగా తెలియజేశారు.

ఇకపోతే తాను ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఎన్నో మంచి హిట్ అందుకున్నాయి.ఇకపోతే తన కెరీర్లో ఏ విధమైనటువంటి ఆటుపోట్లు ఎదురయ్యాయ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్కడైనా మంచి ఉంది అంటే తప్పకుండా చెడు కూడా ఉంటుంది.నా కెరీర్లో కూడా అలాంటి ఆటుపోట్లు ఉన్నాయి అయితే నేను పెద్దగా వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు.

గాడిద గొంతు అన్నారు…

ఇకపోతే తనకు సంగీత దర్శకురాలిగా కన్నా సింగర్ గా పాట పాడటం ఎంతో ఇష్టం ఇలా సింగర్ కావాలని కోరుకుంటున్నట్లు ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏదో ఇష్టపడుతుంది కదా అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకువెళ్లి సంగీతం నేర్పించాలని అడిగారు. ఈ విధంగా అడిగేసరికి బాలు గారు నేను తనకి సంగీతం నేర్పించనని మొహం మీదే చెప్పారు. తన గొంతు గాడిద గొంతులా ఉంది. తనకు నేను సంగీతం నేర్పించనని బాలు గారు చెప్పినట్టు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎం.ఎం.శ్రీలేఖ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!