సిగరెట్లు తాగే అలవాటు ఉన్నవారికి షాకింగ్ న్యూస్ చెప్పారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సిగరెట్లు తాగే అలవాటు ఉన్న వారికీ కరోనా సోకితే ఆ వ్యక్తి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనాల్లో తేలింది. మిగిలిన వారితో పోలిస్తే ధూమపానం చేసేవారికి కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని తేలింది. ఈ పరిశోధన కోసం పొగతాగిన వారు, తాగని వారు ఇద్దరిలో ఊపితిత్తుల కణజాలాల్లో ఉన్న రైబోన్యూక్లిక్ యాసిడ్ (RNA) డేటాను విశ్లేషించారు.

ఈ నేపధ్యలో శ్వాసమార్గంలోని వైరల్ ఇన్ఫెక్షన్ కు ఏసీఈ 2, ఫ్యూరిన్, టిఎంపిఆర్ఎస్ ఎస్ 2 కణజాలాలను క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. ఈ పరిశోధనలో అసలు పొగతాగని వారితో పోలిస్తే సుమారు 100 సిగరెట్లు తగిన వారి ఉపిరితిత్తుల కణజాలాలు వైరస్ బారినపడే అవకాశం ఇరవై ఐదు శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ఇది పొగ త్రాగేవారికి హెచ్చరిక వంటిదే.. సో ధూమపానం అలవాటు ఉన్నవారు వీలైనంతగా కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహిస్తే మంచిది.

































