Social Activist Usha sree : తెలంగాణ సీఎం కెసిఆర్ పేషిలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిని స్మిత సభర్వాల్ ఇంట్లో భయానాక సంఘటన చోటు చేసుకుంది. ఒక ఐఏఎస్ అధికారిని ఇంట్లోకి ఒక వ్యక్తి అర్ధరాత్రి వెళ్లి భయాందోళనకు గురి చేసాడు. ఐఏఎస్ అధికారిని, అందునా భర్త ఐపీస్ అధికారి, అలాంటి ఒక ఇంట్లోకి ఒక వ్యక్తి సెక్యూరిటీని దాట్టుకుని అర్ధరాత్రి ఎలా వచ్చాడు అన్నది చర్చనీయంశంగా మారింది. ఇక ఈ విషయం గురించి సోషల్ ఆక్టివిస్ట్ ఉషశ్రీ మాట్లాడారు.

అతని వెనుక ఎవరున్నారు…
ఐఏఎస్ అధికారిని స్మిత సభర్వాల్ ఇంట్లోకి ఒక జూబ్లీహిల్స్ పరిధి మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆనంత్ కుమార్ రెడ్డి అనే అధికారి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆమెతో తప్పుగా ప్రవర్తించడం, వెంటనే అప్రమత్తం అయిన ఆమె అరిచి సెక్యూరిటీని పిలవడంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ విషయాన్ని స్మిత సభర్వాల్ తన ట్విట్టర్ లో కూడా పంచుకున్నారు. తమ ప్రొమోషన్ గురించి మాట్లాడటానికి ఐఏఎస్ అధికారి దగ్గరకు వెళ్లినట్లు ఆనంద్ రెడ్డి తెలిపినా ఆ సమయంలో వెళ్ళాడమేమిటి అనే అనుమానాలు అందరికీ వచ్చాయి.

Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life.
— Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023
Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency
అయితే ఈ విషయం గురించి సామాజిక వేత్త ఉష శ్రీ మాట్లాడుతూ కావాలనే స్మిత గారికి ఏదో ప్రమాదం తల పెట్టడానికే ఎటువంటి పని చేసారు. ఒక ఐఏఎస్ అధికారిని ఇంటి సెక్యూరిటీని దాట్టుకుని వెళ్ళాడంటే అతని వెనుక ఎవరో పెద్ద వాళ్ళు ఉండి ఉండవచ్చు. అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేసి ఆ సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్ళగలిగాడు. ఆమెకు ఏదో ప్రమాదం తలపెట్టాలనే ప్లాన్ చేసుకుని వెళ్ళాడు అయితే ఆమె అప్రమత్తం అవడం వల్ల ఆమెకు ఏ హాని జరుగలేదు అంటూ ఉష అభిప్రాయపడ్డారు.