Anasuya: యాంకర్ అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం యాంకరింగ్ గుడ్ బై చెబుతూ వెండి తెరపై నటిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

ఇలా వెండితెర సినిమాలలో బిజీగా ఉండి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె తన కొడుకుల వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.
అనసూయ కొడుకులు వల్ల ఎందుకంత ఇబ్బంది పడుతుందనే విషయానికి వస్తే తన కొడుకులు తమ జోబి కాలి చేయకుండా అలాగే బట్టలు వదిలేస్తారని తాను అలాగే వాషింగ్ మిషన్ లోకి వేయడం వల్ల వాషింగ్ మిషన్ తరచూ పాడవుతుందని రెండు నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని ఈమె తన కొడుకులు వల్ల జరిగే నష్టాన్ని తెలియజేశారు.
అలాంటి వాళ్లంటే గౌరవం..
మా ఇంట్లో మాత్రమే ఇలా ఉంటుందా మీకు కూడా ఇలాగే జరుగుతుందా అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే డస్ట్ బిన్ కనిపించే వరకు చెత్త కాగితాలను తమ జోబులో పెట్టుకుంటారో అలాంటివారు అంటే నాకు చాలా గౌరవం అంటూ కూడా అనసూయ ఈ సందర్భంగా తన కొడుకుల వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులను తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
































